Weather update: తీవ్ర వాయుగుండం ఎఫెక్ట్ తో భారీ వర్షాలు.. ఈ ప్రాంతాల్లో ఆగస్టు 3 వరకు అలర్ట్

Published : Jul 28, 2026, 08:54 AM IST

Weather update: బంగాళాఖాతంలో బలపడిన తీవ్ర వాయుగుండంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఆగస్టు 3 వరకు ఏపీ, తెలంగాణల్లో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) అంచనా వేసింది.

PREV
16
వాయుగుండం ఎఫెక్ట్ తో భారీ వర్షాలు

ఏపీ, తెలంగాణలో వాతావరణం ఒక్కసారిగా ఛేంజ్ అయిపోయింది. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం మరింత తీవ్రంగా మారి ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల పై తన ప్రభావం చూపుతోంది. భారత వాతావరణ శాఖ ఇచ్చిన అప్‌డేట్ ప్రకారం.. ఆగస్టు 3 వరకు తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో వర్షాలు, ఈదురుగాలులు, పిడుగుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.

26
బంగాళాఖాతంలో వాయుగుండం

వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఈ వాయుగుండం బాగా బలపడి తీవ్ర వాయుగుండంగా మారింది. ఇది గంటకు సుమారు 3 కిలోమీటర్ల నెమ్మదిగా ఉండే వేగంతో ఉత్తర దిశగా ప్రయాణిస్తోంది. ప్రస్తుతం ఇది పశ్చిమ బెంగాల్-ఉత్తర ఒడిశా తీర ప్రాంతాలకు ఆనుకుని ఉన్న హల్దియా, బాలాసోర్ మధ్య కేంద్రీకృతమై ఉంది. కొద్ది గంటల్లో హల్దియా సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని సైంటిస్టులు అంచనా వేస్తున్నారు. దీని కారణంగా కోస్తా ప్రాంతాల్లోని ఓడరేవుల్లో మూడో నంబరు, ఒకటో నంబరు ప్రమాద హెచ్చరికలను కూడా జారీ చేశారు.

36
తెలంగాణలో భారీ వర్షాలు.. ఐటీ ఉద్యోగులకు అలర్ట్

వాతావరణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం, ఆగస్టు 3 వరకు తెలంగాణలోని చాలా జిల్లాల్లో భారీ వర్ష సూచన ఉంది. ముఖ్యంగా ఉత్తర, ఈశాన్య తెలంగాణ జిల్లాలైన ఆదిలాబాద్, కొమురం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, జగిత్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం ప్రాంతాల్లో అక్కడక్కడ కుండపోత వర్షాలు పడవచ్చు.

మరోవైపు గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది. సాయంత్రం వేళల్లో ట్రాఫిక్ జామ్‌లు, రోడ్లపై నీరు నిలిచే సమస్య తలెత్తకుండా పోలీసులు స్పందించారు. ఐటీ కంపెనీల యాజమాన్యాలు తమ ఉద్యోగులను ముందస్తుగా లాగ్‌అవుట్ అయ్యేందుకు అనుమతించాలని కీలక సూచనలు చేశారు. దీనివల్ల ఉద్యోగులు సురక్షితంగా ఇళ్లకు చేరుకోవచ్చని స్పష్టం చేశారు.

46
ఆంధ్రప్రదేశ్‌పై వాయుగుండం ప్రభావం ఎంత?

ఈ తీవ్ర వాయుగుండం తన దిశను మార్చుకుని ఉత్తరం వైపుగా వెళ్లడం వల్ల అనుకున్న స్థాయిలో భారీ వర్షాలు పడటం లేదని తెలుస్తోంది. అయినప్పటికీ అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం, పోలవరం, కాకినాడ, ఉభయ గోదావరి, ఏలూరు జిల్లాల్లో ఉరుములు, పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది. శ్రీకాకుళం, విజయనగరం, బాపట్ల, తిరుపతి, శ్రీసత్యసాయి జిల్లాల్లో చెదురుమదురు జల్లులు పడవచ్చు.

అయితే, రాష్ట్రంలో ఇప్పటివరకు 54 శాతం వర్షపాతం లోటు నమోదవ్వడం, ఎల్ నినో ప్రభావం స్పష్టంగా కనిపిస్తుండటంతో వ్యవసాయానికి సరైన నీరు అందక రైతన్నలు ఆందోళన చెందుతున్నారు.

56
గంటకు 30-40 కిమీ వేగంతో బలమైన గాలులు

వర్షాలతో పాటు రెండు రాష్ట్రాల్లో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశముంది. అందుకే సముద్రం అలజడిగా ఉంటుందని, బుధవారం వరకు మత్స్యకారులు వేటకు వెళ్లకూడదని అధికారులు ఆంక్షలు విధించారు. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులు వస్తున్న సమయంలో బయట ఉన్నవారు పొరపాటున కూడా పెద్ద చెట్ల కింద, విద్యుత్ స్తంభాల వద్ద లేదా ప్రకటనల హోర్డింగ్స్ కింద నిలబడకూడదని తెలిపారు.

66
ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

రాబోయే కొద్ది రోజులు వాతావరణం అస్థిరంగా ఉండనుంది. అత్యవసర పనులు ఉంటే తప్ప వర్షం పడే సమయంలో బయటకు రాకపోవడమే మంచిది. వాహనదారులు, రోడ్లపై వెళ్లేవారు చెట్ల కింద ఆగకుండా సురక్షంగా వెళ్లాలని ఏపీ డిజాస్టర్ మేనేజ్‌మెంట్, తెలంగాణ వాతావరణ అధికారులు తెలిపారు.

Read more Photos on
click me!

Recommended Stories