తెలుగు టీవీ యాంకర్ అనుమానాస్పద మృతి

By Surya PrakashFirst Published Apr 9, 2020, 2:37 PM IST
Highlights

ప్రముఖ టీవీ యాంకర్‌, సీరియల్‌ నటి శాంతి( విశ్వశాంతి) అనుమానస్పదంగా మృతి చెందారు. హైదరాబాద్  ఎస్సార్‌ నగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని ఎల్లారెడ్డి గూడెం ఇంజనీర్స్‌ కాలనీలోని తన నివాసంలో గురువారం ఆమె శవమై కనిపించారు. 

ప్రముఖ టీవీ యాంకర్‌, సీరియల్‌ నటి శాంతి( విశ్వశాంతి) అనుమానస్పదంగా మృతి చెందారు. హైదరాబాద్  ఎస్సార్‌ నగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని ఎల్లారెడ్డి గూడెం ఇంజనీర్స్‌ కాలనీలోని తన నివాసంలో గురువారం ఆమె శవమై కనిపించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని.. పోస్ట్‌మార్టం నిమిత్తం ఆమె మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై  కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 

ఇక శాంతి ఎలా చనిపోయిందనేదానిపై చుటుపక్కల వారిని విచారిస్తున్నారు. అసలు ఆమెది హత్యనా..? ఆత్మహత్యనా..? అన్న కోణంలో దర్యాప్తును ప్రారంభించారు. ఇంట్లో తనిఖీలు చేసి ఆమె ఫోన్‌ను స్వాధీనం చేసుకోవడంతో పాటు.. సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలిస్తున్నారు. 

ఇక వైజాగ్‌కు చెందిన శాంతి.. పలు సీరియల్స్‌లో నటించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని, కేసు నమోదు చేశారు. ఆమె ఆత్మహత్య చేసుకున్నారా ? లేక ఎవరైనా చంపేశారా అనే యాంగిల్ లో దర్యాప్తు చేపట్టారు. ఆమె ఎలా చనిపోయిందనేదానిపై చుటుపక్కల వారిని కూడా విచారిస్తున్నారు. శాంతి మరణంతో పలువురు టీవీ నటులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. 
 

click me!