టాలీవుడ్ డ్రగ్స్ కేసు: ముగిసిన నందు విచారణ.. ఇంకా ఈడీ కస్టడీలోనే కెల్విన్

By Siva KodatiFirst Published Sep 7, 2021, 7:21 PM IST
Highlights

టాలీవుడ్ డ్రగ్స్ కేసులో సినీనటుడు నందు ఈడీ విచారణ ముగిసింది. దాదాపు 8 గంటల పాటు నందును ప్రశ్నించారు అధికారులు. అతని బ్యాంక్ లావాదేవీలపై ఆరా తీశారు. డ్రగ్స్ పెడ్లర్ కెల్విన్‌తో వున్న పరిచయంపై ప్రశ్నల వర్షం కురిపించారు. 
 

టాలీవుడ్ డ్రగ్స్ కేసులో సినీనటుడు నందు ఈడీ విచారణ ముగిసింది. దాదాపు 8 గంటల పాటు నందును ప్రశ్నించారు అధికారులు. అతని బ్యాంక్ లావాదేవీలపై ఆరా తీశారు. డ్రగ్స్ పెడ్లర్ కెల్విన్‌తో వున్న పరిచయంపై ప్రశ్నల వర్షం కురిపించారు. కెల్విన్ సమక్షంలోనే నందును ప్రశ్నించారు ఈడీ అధికారులు. రేపు దగ్గుబాటి రానా ఈడీ ఎదుట విచారణకు హాజరుకానున్నారు. మరోవైపు కెల్విన్ ఇంట్లో నాలుగు గంటల పాటు సోదాలు నిర్వహించారు. ప్రస్తుతం ఈడీ కార్యాలయంలోనే వున్నాడు కెల్విన్.

అటు కెల్విన్ , ఖుద్దూస్, వాహీద్ ఇళ్లలో ఉదయం నుంచి సోదాలు జరుగుతున్నాయి. ముగ్గురిని వేర్వేరుగా ప్రశ్నిస్తున్నారు . వారి ఇళ్లలో లాప్‌టాప్, సెల్‌ఫోన్, ఎలక్ట్రానిక్ డివైస్‌లను స్వాధీనం చేసుకున్నారు. కెల్విన్ ఇంట్లో దాదాపు నాలుగు గంటల పాటు సోదాలు నిర్వహించారు. ఇక మెహిదీపట్నంలో మరో నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు ఈడీ అధికారులు. మరోవైపు ఈ కేసులో కెల్విన్‌కు నాంపల్లి కోర్టు సమన్లు జారీ చేసింది. అక్టోబర్ 11న విచారణకు హాజరుకావాలని కెల్విన్‌ను కోర్ట్ ఆదేశించింది. డ్రగ్స్ కేసులో కెల్విన్‌ను 2016లో అరెస్ట్ చేశారు టాస్క్‌ఫోర్స్ పోలీసులు. కెల్విన్‌పై అభియోగపత్రాన్ని విచారణకు స్వీకరించింది నాంపల్లి కోర్ట్. 
 

click me!