సూపర్ స్టార్ మహేష్కి ఆయన ముద్దుల తనయ సితార బర్త్ డే విషెస్ తెలిపింది. మహేష్కి ఈ బర్త్ డే సందర్భంగా ఆమె విషెస్ చాలా స్పెషల్గా నిలిచాయని చెప్పొచ్చు.
మహేష్కి తన బర్త్ డే సందర్భంగా అనేక మంది సినీ ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేశారు. కానీ ఆయనకు మాత్రం ఒక్కరి బర్త్ డే విషెస్ స్పెషల్గా నిలిచింది. ఆయన ప్రత్యేకంగా ఫీలవుతున్నారు. ఆ ఒక్కరు ఎవరో కాదు.. ఆయన గారాల పట్టి, ముద్దుల తనయ సితార ఘట్టమనేని. సితార తండ్రికి ఇన్స్టాగ్రామ్ ద్వారా విషెస్ తెలియజేసింది.
ఆమె చెబుతూ, ప్రపంచానికి మీరు సూపర్ స్టార్ అయితే మాకు మాత్రం మీరే ప్రపంచం. హ్యాపీ బర్త్డే నాన్న. మా ఆటల్లో, అల్లరిలో, నవ్వడం, పాడటం ఇలా అన్నింటిలోను మీరు మాకు బెస్ట్ డాడీగా ఉన్నందుకు ధన్యవాదాలు. ఇప్పుడే కాదు ఎల్లప్పుడు మిమ్మిల్నీ ప్రేమిస్తూనే ఉంటా. లవ్ యూ నాన్న` అంటూ సితార పోస్టు చేసింది. ఈ సందర్బంగా తండ్రితో దిగిన ఫోటోని పంచుకుంది సితార.
మరోవైపు మహేష్ భార్య నమ్రత సైతం ఇన్స్టాగ్రామ్ ద్వారా విషెస్ తెలిపింది. `అప్పుడు, ఇప్పుడు, ఎప్పటికీ నాపై ప్రేమని నిర్వచించే వ్యక్తి మీరు. బర్త్ డే విషెస్ మహేష్బాబు. మీకు తెలియని దానికంటే ఎక్కువగా నిన్ను ప్రేమిస్తున్నా` అని వెల్లడించింది.
మహేష్, నమ్రత కలిసి నటించిన `వంశీ` చిత్ర సమయంలో ప్రేమలో పడ్డారు. 2000లో ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం బాక్స్ఫీస్ వద్ద అంతగా మెప్పింపలేకపోయింది. కానీ వీరి ప్రేమకు మజిలీగా మారింది. ఓసారి ఈ సినిమా అవుట్డోర్ షూటింగ్లో భాగంగా చిత్ర యూనిట్ న్యూజిలాండ్ వెళ్లారు. దాదాపు 25రోజుల పాటు అక్కడే షూట్ చేశారు. ఆ సమయంలోనే వీరి స్నేహం మరింత బలపడింది. షూటింగ్ నుంచి తిరిగి వచ్చాక మొదట నమ్రతనే తన ప్రేమను వ్యక్తపరిచింది.
అప్పటికే నమ్రత అంటే మహేశ్కు ఎంతో ఇష్టం ఉండటంతో ఆయన కూడా వెంటనే ఓకే చెప్పేశారు. కానీ వీరి ప్రేమను మహేష్ తొలుత కుటుంబం అంగీకరించలేదట. దీంతో మహేష్ తన సోదరి మంజుల సహాయం తీసుకున్నారట. అలా నమ్రత-మహేశ్ల పెళ్లి జరగడంలో మంజుల కీలక పాత్ర పోషించిందట. దాదాపు ఐదేళ్ల ప్రేమాయణం అనంతరం 2005 ఫిబ్రవరి 10న నమ్రత-మహేశ్లు పెళ్లిబంధంతో ఒక్కటయ్యారు. వీరికి కుమారుడు గౌతమ్, కూతురు సితార ఉన్నారు.