జుహులోని రాజ్కుంద్రా నివాసంలో సోదాలు నిర్వహించిన పోలీసులకు కేసుకు సంబంధించి కొన్ని కీలక ఆధారాలను సంపాదించినట్టు తెలుస్తుంది. ఈ సందర్భంగా శిల్పాశెట్టి కన్నీటి పర్యంతమైనట్లు సమాచారం.
నటి శిల్పా శెట్టి కన్నీళ్లు పెట్టుకుంది. తమ జీవితం ఇలా అయిపోయిందని బాధపడుతూ, ఇమేజ్ డ్యామేజ్ అయినందుకు ఆమె కన్నీటి పర్యంతమయ్యారు. పోలీసుల విచారణలో ఆమె ఎమోషనల్ అయినట్టు సమాచారం. పోర్నోగ్రఫీ కేసులో శిల్పా శెట్టి భర్త రాజ్కుంద్రా గత వారం అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. ఈ కేసులో అనేక విషయాలు బయటకు వస్తున్నాయి. నీలి చిత్రాల దందాతోపాటు మనీలాండరింగ్ వంటి విషయాలు బయటపడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ కేసుకు సంబంధించిన శిల్పాశెట్టిని కూడా విచారిస్తున్నారు.
ఈ విచారణలో భాగంగా జుహులోని రాజ్కుంద్రా నివాసంలో సోదాలు నిర్వహించిన పోలీసులకు కేసుకు సంబంధించి కొన్ని కీలక ఆధారాలను సంపాదించినట్టు తెలుస్తుంది. ఈ సందర్భంగా రాజ్ కుంద్రా, శిల్పాశెట్టిలను విచారిస్తుండగా శిల్పాశెట్టి కన్నీటి పర్యంతమైనట్లు సమాచారం. ఈ మొత్తం వ్యవహారంతో తమ ఇమేజ్ డ్యామేజ్ అయ్యిందని చెబుతూ పోలీసుల ముందు శిల్పా ఎమోషనల్ అయిందట. అంతేకాకుండా ఈ కేసు వల్ల కొన్ని అగ్రిమెంట్స్ క్యాన్సిల్ అయ్యాయని, దీంతో తీవ్రంగా నష్టపోయామని శిల్పా పేర్కొన్నట్లు తెలుస్తోంది.
విచారణ నిమిత్తం ఇంటికి వచ్చిన రాజ్కుంద్రాతో శిల్పా వాగ్వాదానికి దిగినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. అయితే పోలీసుల విచారణలో మాత్రం భర్తను వెనకేసుకొచ్చిందని, రాజ్కుంద్రా శృంగారభరితమైన సినిమాలు తీస్తారే తప్ప పోర్న్ (అశ్లీల / నీలి చిత్రాలు) తీయరని శిల్పా తన వాంగ్మూలంలో వివరించింది. హాట్షాట్స్ ఓటీటీ ప్లాట్ఫామ్లో వచ్చే కంటెంట్పై తనకి ఎలాంటి అవగాహన లేదని, దాంట్లో తన ప్రమేయం ఏ మాత్రం లేదని వెల్లడించింది.
ఈ కేసులో రాజ్కుంద్రాని ఈ నెల 19న పోలీసులు అరెస్ట్ చేశారు. అనేక కోణాల్లో విచారిస్తున్నారు. మంగళవారం ఆయన పోలీసు కస్టడీలో ఉన్నారు. రాజ్కుంద్రాని అనేక కోణాల్లో విచారిస్తున్నారు. దీంతో కొత్త విషయాలు బయటకొస్తున్నట్టు సమాచారం. కాగా దాదాపు 48 టెరాబైట్(టీబీ)ల అశ్లీల ఫొటోలు, వీడియోలు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.