భారీ క్యూలో నిల్చున్న ఎన్టీఆర్! (వీడియో)

By Udayavani DhuliFirst Published Dec 7, 2018, 9:49 AM IST
Highlights

తెలంగాణా రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే. సామాన్య ప్రజలతో పాటు సెలబ్రిటీలు సైతం సకాలంలో పోలింగ్ కేంద్రాలకిచేరుకొని తమ ఓటు హక్కుని వినియోగించుకుంటున్నారు.

తెలంగాణా రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే. సామాన్య ప్రజలతో పాటు సెలబ్రిటీలు సైతం సకాలంలో పోలింగ్ కేంద్రాలకి చేరుకొని తమ ఓటు హక్కుని వినియోగించుకుంటున్నారు.

ఇప్పటికే నాగార్జున, వెంకటేష్, చిరంజీవి, అల్లు అర్జున్ ఇలా చాలా మంది సెలబ్రిటీలు తమ ఓటు హక్కుని వినియోగించుకున్నారు. 9:30 కి పోలింగ్ కేంద్రానికి చేరుకుంటానని చెప్పిన ఎన్టీఆర్ టైమ్ కి పోలింగ్ కేంద్రానికి చేరుకున్నారు. తన తల్లి, సతీమణితో కలిసి ఎన్టీఆర్ ఓటు వేయబోతున్నారు. సామాన్యుడిలా క్యూలో నిల్చొని తన టర్మ్ కోసం ఎదురుచూస్తున్నాడు ఎన్టీఆర్.

తన ముందు 40 నుండి 50 మంది వరకు లైన్ లో ఉన్నట్లు తెలుస్తోంది. గతంలో కూడా ఎన్టీఆర్ జిహెచ్ఎంసి ఎన్నికల్లో ఓటు వేశారు. ఎన్టీఆర్ తో సెల్ఫీలు దిగాలని అక్కడివారు ప్రయత్నిస్తున్నా.. పోలింగ్ కేంద్రాల్లో ఇలాంటి చర్యలకి పాల్పడద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేయడంతో వెనక్కి తగ్గుతున్నారు.  శుక్రవారం ఉదయం ఏడుగంటలకు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ మొదలైన సంగతి తెలిసిందే.

119 నియోజకవర్గాల్లోని 32,185 పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికల సిబ్బంది ఓటింగ్‌ను ప్రారంభించారు. మావోయిస్టు ప్రాబల్యం ఉన్న 13 నియోజకవర్గాల్లో సాయంత్రం 4 గంటల వరకే పోలింగ్ జరగనుండగా.. మిగిలిన ప్రాంతాల్లో షెడ్యూల్ ప్రకారం సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగుతుందని ఎన్నికల సంఘం ప్రకటించింది.

"

ఓటు హక్కు వినియోగించుకున్న మెగాస్టార్ చిరంజీవి!

ఓటేసిన వెంకటేష్, నితిన్!

ఓటు హక్కు వినియోగించుకున్న అల్లు అర్జున్, నాగార్జున, అమల!

ఓటువేసి ప్రజాస్వామ్యాన్ని బలపరచాలి.. హరీష్ రావు

భూపాలపల్లిలో మొరాయిస్తున్న ఈవీఎంలు.. ప్రారంభంకాని పోలింగ్

ఓటు హక్కు వినియోగించుకున్న హరీష్ రావు

తెలంగాణ ఎన్నికలు: ప్రారంభమైన పోలింగ్

ఓటేసిన మంత్రులు తుమ్మల, జగదీశ్ రెడ్డి

click me!