మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) 2019 ఎన్నికలు ముగిశాయి. ఈరోజు మధ్యాహ్నం 2 గంటల వరకు పోలింగ్ నిర్వహించారు.
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) 2019 ఎన్నికలు ముగిశాయి. ఈరోజు మధ్యాహ్నం 2 గంటల వరకు పోలింగ్ నిర్వహించారు. సాయంత్రం 5 గంటల నుండి
ఓట్ల లెక్కింపు ప్రక్రియ మొదలైంది.
గతంలో ఈవీఎంలను ఉపయోగించి ఎన్నికలు నిర్వహించగా.. ఈసారి పోలింగ్ కు బ్యాలెట్ పత్రాలను ఉపయోగించారు. ఈ ఎన్నికల్లో శివాజీ రాజా ప్యానెల్, నరేష్ ప్యానెల్ మధ్య పోరు రసవత్తరంగా సాగింది.
'మా' అసోసియేషన్ లో మొత్తం 745 ఓట్లు ఉండగా.. 472 మంది తమ ఓటు హక్కుని వినియోగించుకున్నారు. ఈ రేంజ్ లో మా ఎలెక్షన్స్ లో పోలింగ్ జరగడం ఇదే తొలిసారి.
సినిమా ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులంతా ఫిలిం ఛాంబర్ కి చేరుకొని ఓటు వేశారు. మరికాసేపట్లో విజేతగా ఎవరు నిలిచారో అనౌన్స్ చేయనున్నారు.
ఇవి కూడా చదవండి..
'మా' ఎలెక్షన్స్: ఓటు హక్కు వినియోగించుకున్న తారలు!
'మా' ఎలక్షన్స్ లో ఆల్ టైమ్ రికార్డ్ పోలింగ్.. నరేష్ కామెంట్స్!
శివాజీ ప్యానెల్ డబ్బులు పంచుతున్నారు: నరేష్!
'మా' ఎన్నికల్లో ఓటేసిన సినీ ప్రముఖులు!