స్టార్ హీరో ఫామ్ హౌస్ లో మైనర్ బాలికపై రేప్.. గుర్రాలకు కాపలా ఉండే వ్యక్తే..

By telugu teamFirst Published Sep 18, 2021, 5:13 PM IST
Highlights

క్రమంగా దేశంలో మహిళలు, చిన్నారి బాలికలకు రక్షణ కరువవుతోంది. సైదాబాద్ చిన్నారిపై రేప్, హత్య సంఘటన దేశం మొత్తాన్ని షాక్ కి గురిచేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో నిందితుడు ఆత్మహత్య చేసుకుని మరణించాడు.

క్రమంగా దేశంలో మహిళలు, చిన్నారి బాలికలకు రక్షణ కరువవుతోంది. సైదాబాద్ చిన్నారిపై రేప్, హత్య సంఘటన దేశం మొత్తాన్ని షాక్ కి గురిచేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో నిందితుడు ఆత్మహత్య చేసుకుని మరణించాడు. ఈ సంఘటన మరువక ముందే కర్ణాటక మైసూర్ సమీపంలో మరో ఘటన చోటు చేసుకుంది. 

మరో కీచకుడు మైనర్ బాలికపై అత్యాచారం చేశాడు. శాండల్ వుడ్ లో స్టార్ హీరోగా రాణిస్తున్న దర్శన్ ఫామ్ హౌస్ లో జరిగినట్లు తెలుస్తోంది. మైసూర్ సమీపంలో టి నరాశిపురా రోడ్ దగ్గర దర్శన్ కి చెందిన ఫామ్ హౌస్ ఉంది. 

ఈ ఫామ్ హౌస్ లో నజీమ్ అనే వ్యక్తి గుర్రాలకి కాపలాగా, కేర్ టేకర్ గా ఉంటున్నాడు. అతడు బీహార్ కు చెందిన వ్యక్తి. అదే ఫామ్ హౌస్ లో శివమొగ్గ ప్రాంతానికి చెందిన దంపతులు కొడుకు, కుమార్తె తో కలసి అక్కడే పని చేస్తున్నారు. 

సెప్టెంబర్ 3న నజీమ్ మైనర్ బాలికపై అత్యాచారం చేశాడు. ఆ సంఘటన ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. సెప్టెంబర్ 15న ఆ బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు నజీమ్ ని అరెస్ట్ చేసి జ్యుడిషియల్ కస్టడీకి తరలించారు. 

దర్శన్ ఫామ్ హౌస్ లో ఉండే గుర్రాల కోసం నజీమ్ పనిచేస్తుంటాడు. అత్యాచారానికి గురైన బాలిక.. బదిలీ సర్టిఫికేట్ ఇష్యూ కారణంగా స్కూల్ కి వెళ్లకుండా తల్లిదండ్రులతో ఉంటోందని సమాచారం. ఈ క్రమంలో కీచకుడు నజీమ్ ఆ బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. 

click me!