‘గాడ్ ఫాదర్’ విలన్‌గా ఆ స్టార్? కంగారుపెడుతున్న మెగాభిమానులు

By Surya PrakashFirst Published Aug 30, 2021, 9:40 AM IST
Highlights

`గాడ్ ఫాదర్` మలయాళ బ్లాక్ బస్టర్ `లూసిఫర్`కి తెలుగు రీమేక్. చిరంజీవి కొన్ని వారాల క్రితం హైదరాబాద్ లో సినిమా షూటింగ్ ప్రారంభించారు. ఈ చిత్రంలో నయనతార- సత్య దేవ్ - అనసూయ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.

మెగాస్టార్ చిరంజీవి వరస  సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. వాటిల్లో మొదటగా గాడ్ ఫాదర్ సినిమా షూటింగ్ మొదలు కాబోతుంది. మలయాళంలో సూపర్ డూపర్ హిట్ అయిన సినిమాకు రీమేక్ ఇది. ఈ సినిమాలో లుక్  కోసం చిరంజీవి చాలా కష్టపడుతున్నాడు.  కాస్టింగ్ విషయంలోనూ ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నాడు.  ఈ నేపధ్యంలో తాజాగా ఈ సినిమాలో కీ రోల్ చేయటం కోసం మాధవన్ ని ఎంపిక చేసినట్లు సమాచారం. 

ఇప్ప‌టికే తెలుగులో స‌వ్య‌సాచి చిత్రంలో విల‌న్ గా క‌నిపించాడు మాధ‌వ‌న్. అలాగే అనుష్క ప్రధాన పాత్రలో వచ్చిన నిశ్శబ్దం చిత్రంలోనూ విలన్ గా చేసారు. అయితే తెలుగులో విలన్ గా చేసిన రెండు చిత్రాలు డిజాస్టర్స్ అయ్యాయి. దాంతో ఈ వార్త కొందరు మెగాభిమానులను కంగారుపెడుతోంది.  అయితే రీమేక్ సినిమాల స్పెషలిస్ట్ మోహన్ రాజా దర్శకుడు కావడంతో ఎక్సపెక్టేషన్స్ మరింత పెరిగాయి. ఈ సినిమా షూటింగ్ వైజాగ్ జైలు నుంచి మొదలు పెట్టనున్నారు. అయితే అజిత్ తాజా చిత్రం వాలిమై సినిమా కోసం సినిమాటోగ్రాఫర్ నీరవ్ షా రష్యా వెళ్లడంతో.. చిరంజీవి సినిమా కాస్త ఆలస్యంగా మొదలు కానుంది.  

ఇక గాడ్ ఫాద‌ర్ లో టాలీవుడ్‌ యువ హీరో స‌త్య‌దేవ్ కీల‌క పాత్ర‌లో క‌నిపిస్తోండ‌గా..లేడీ సూప‌ర్ స్టార్ న‌య‌న‌తార అత‌ని భార్య పాత్ర‌లో న‌టిస్తున్న‌ట్టు టాలీవుడ్ వ‌ర్గాల స‌మాచారం. మ‌రోవైపు అందాల న‌టి అన‌సూయ భ‌ర‌ద్వాజ్ కీ రోల్ పోషిస్తోంది.
 

click me!