`మీరు లేని లోటు తీరనిది`.. తాత జయంతి రోజున ఎమోషనల్‌ అయిన తారక్‌

By Satish ReddyFirst Published May 28, 2020, 10:30 AM IST
Highlights

ఎన్టీఆర్‌ తన సోషల్ మీడియా పేజ్‌లో తాతను తలుచుకుంటూ ఎమోషనల్‌ ట్వీట్ చేశాడు. `మీరు లేని లోటు తీరనిది.. మీ పాదం మోపక తెలుగు ధరిత్రి చిన్నబోతోంది. మీ రూపు కానక తెలుగు గుండె తల్లడిల్లిపోతోంది. పెద్ద మనసుతో ఈ ధరిత్రిని, ఈ గుండెను మరొక్కసారి తాకిపో తాత` అంటూ ట్వీట్ చేశాడు ఎన్టీఆర్.

విశ్వ విఖ్యాత నట సార్వభౌముడు నందమూరి తారకరామారావు జయంతి సందర్భంగా అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతూ సోషల్ మీడియాను మోతెక్కిస్తున్నారు. సామన్య ప్రజలతో పాటు సెలబ్రిటీలు కూడా తారక రాముణ్ని తలుచుకుంటూ ట్వీట్‌లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో నందమూరి నట వారసుడు యంగ్ టైగర్‌ ఎన్టీఆర్ ఎమోషనల్ ట్వీట్ చేశాడు. ప్రతీ ఏటా ఎన్టీఆర్‌ జయంతి సందర్భంగా ఆయన ఘాట్‌ వద్ద నివాళులర్పించటం జూనియర్‌ ఎన్టీఆర్‌కు అలవాటు. అయితే ఈ సారి కరోనా ప్రబలుతున్న నేపథ్యంలో ఎన్టీఆర్‌, కళ్యాణ్ రామ్‌లు ఎన్టీఆర్‌ ఘాట్‌ను సందర్భించ వద్దని నిర్ణయించుకున్నారు.

ఈ సందర్భంగా ఎన్టీఆర్‌ తన సోషల్ మీడియా పేజ్‌లో తాతను తలుచుకుంటూ ఎమోషనల్‌ ట్వీట్ చేశాడు. `మీరు లేని లోటు తీరనిది.. మీ పాదం మోపక తెలుగు ధరిత్రి చిన్నబోతోంది. మీ రూపు కానక తెలుగు గుండె తల్లడిల్లిపోతోంది. పెద్ద మనసుతో ఈ ధరిత్రిని, ఈ గుండెను మరొక్కసారి తాకిపో తాత` అంటూ ట్వీట్ చేశాడు ఎన్టీఆర్. ఈ ట్వీట్‌ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. నందమూరి అభిమానులు తాత, మనవళ్ల బంధాన్ని గుర్తు చేసుకుంటున్నారు.

మీరు లేని లోటు తీరనిది... pic.twitter.com/FA1uyWaWoS

— Jr NTR (@tarak9999)

ఇక సినిమాల విషయానికి వస్తే ఎన్టీఆర్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ఆర్ ఆర్ ఆర్‌ సినిమాలో నటిస్తున్నాడు. పీరియాడిక్ యాక్షన్‌ డ్రామాగా తెరకెక్కుతున్న ఈసినిమాలో ఎన్టీఆర్‌ తెలంగాణ సాయుధ పోరాట యోధుడు కొమరం భీం పాత్రలో నటిస్తున్నాడు.. ఇప్పటికే మేజర్‌ పార్ట్ షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా 2021 జనవరిలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేశారు. కానీ ప్రస్తుతం లాక్ డౌన్ కారణంగా షూటింగ్ ఆగిపోవటంతో అనుకున్న సమయానికి సినిమా రిలీజ్ కావటం కష్టం అని తెలుస్తోంది.

click me!