కమెడియన్ కు కరోనా కష్టాలు: 14రోజులు హౌస్ అరెస్టే

By Surya PrakashFirst Published Mar 18, 2020, 7:56 AM IST
Highlights

ప్రపంచ వ్యాప్తంగా ప్రస్తుతం కరోనా వైరస్ విశ్వరూపం చూపిస్తూ జనాలని భయ భ్రాంతులను చేస్తోంది.  ఈ నేపధ్యంలో అందరూ తగినన్ని జాగ్రత్తలు తీసుకోవటమే కాక, ఈ వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు కాను... ఇంట్లోనే కూర్చుంటున్నారు. కమిడియన్ ప్రియదర్శి సైతం ఇప్పుడు అదే చేస్తున్నారు.

ప్రపంచ వ్యాప్తంగా ప్రస్తుతం కరోనా వైరస్ విశ్వరూపం చూపిస్తూ జనాలని భయ భ్రాంతులను చేస్తోంది.  ఈ నేపధ్యంలో అందరూ తగినన్ని జాగ్రత్తలు తీసుకోవటమే కాక, ఈ వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు కాను... ఇంట్లోనే కూర్చుంటున్నారు అంతా. ప్రభుత్వాలు కూడా ముందడగు వేసి విద్యాసంస్థలతో పాటు మాల్స్, థియేటర్స్ అన్నీ మూసేయాలని ఆర్డర్స్ ఇచ్చారు. ఈ నేపధ్యంలోనే సినిమా షూటింగ్స్ కూడా ఆపేసారు. అయితే వీటిని లెక్క చేయకుండా, ఏ మాత్రం పట్టించుకోకుండా జార్జియాలో షెడ్యూల్ పూర్తి చేసుకుని వచ్చారు ప్రభాస్ అండ్ టీం. ఈ టీమ్ లోనే కమెడియన్ ప్రియదర్శి కూడా ఉన్నాడు.   

ఇక రీసెంట్ గా జార్జియాలో ప్రభాస్ సినిమా షూటింగ్ ముగించుకొని హైదరాబాద్ వచ్చిన  ప్రియదర్శి శంషాబాద్ విమానాశ్రయంలో కరోనా వైరస్ స్ర్కీనింగ్ అనంతరం ఇంట్లోనే ఉండిపోయారు. తనకు తాను క్లీన్ చిట్ ఇచ్చుకునేందుకు బాధ్యతగా 14రోజులు ప్రజలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లుగా ప్రియదర్శి ట్విట్టర్ ద్వారా తెలిపారు. ప్రియదర్శి తీసుకున్న ఈ నిర్ణయంపై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది.

https://twitter.com/priyadarshi_i/status/1239851102293463042

ప్రస్తుతం  ప్రభాస్.. రాధాకృష్ణ దర్శకత్వంలో ఒక పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ లవ్ స్టోరీ చేస్తున్నాడు. ఈ సినిమాను యూరప్ నేపథ్యంలో 1970-80ల నేపథ్యంలో తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో ప్రభాస్ సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. తాాజాగా ఈ సినిమాకు సంబంధించిన జార్జియా షెడ్యూల్ కంప్లీటైంది. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ ప్రకటించాడు. జార్జియన్‌ల సహాయంతో ఈ షెడ్యూల్ త్వరగా పూర్తైయిందన్నారు. త్వరలో కొత్త షెడ్యూల్ మొదలుపెట్టబోతున్నట్టు ప్రకటించారు.
 

click me!