పదే పదే నాపై న్యూడ్ సీన్స్ తీసేవాడు.. నేను ఏడ్చేశా: నటి

First Published Jul 12, 2018, 3:02 PM IST
Highlights

 ఒక సీన్ ఏడెనిమిది సార్లు చిత్రీకరించేవారు. ఆ సమయంలో నేను ఏడ్చేశాను. అలా ఎక్కువసార్లు టేక్స్ తీసుకుంటున్నందుకు తనను తప్పుగా అనుకోవద్దని సీన్ మరింత అందంగా రావడం కోసమే అలా చేస్తున్నట్లు అనురాగ్ చెప్పేవారు

బాలీవుడ్ అగ్ర దర్శకుల్లో ఒకరైన అనురాగ్ కశ్యప్ తనపై పదే పదే న్యూడ్ సీన్స్ తీసేవాడని అతడి కారణంగా ఏడ్చేశానని నటి కుబ్రా సైత్ వెల్లడించారు. ప్రస్తుతం బాలీవుడ్, టాలీవుడ్ లలో వెబ్ సిరీస్ ల హవా మొదలైన సంగతి తెలిసిందే. కొందరు పెద్ద దర్శకులు సైతం ఈ వెబ్ సిరీస్ లు రూపొందించడానికి ఆసక్తి చూపుతున్నారు. ఈ క్రమంలో బాలీవుడ్ లో అనురాగ్ కశ్యప్ 'సాక్రెడ్ గేమ్స్' అనే వెబ్ సిరీస్ ను చిత్రీకరించారు.

ఈ సిరీస్ లో సైఫ్ అలీ ఖాన్, నవాజుద్దీన్ సిద్దికీ, రాధికా ఆప్టే వంటి ప్రముఖ నటులతో పాటు కుబ్రా సైత్ అనే నటి కూడా నటించింది. ఈ సిరీస్ ను ఇంగ్లీష్, హిందీ భాషల్లో పలు దేశాల్లో విడుదల చేశారు. అయితే ఈ సిరీస్ కు సంబంధించి ఓ సందర్భంలో తను ఏడ్చేశానని నటి కుబ్రా సైత్ వెల్లడించింది. ''ఈ వెబ్ సిరీస్ లో నేను నగ్నంగా కనిపించాల్సివుంటుంది. ఆ విషయం దర్శకుడు అనురాగ్ కశ్యప్, కో డైరెక్టర్ నాకు ముందే చెప్పారు. అయితే నగ్నంగా నటించాల్సిన సన్నివేశాలను పదే పదే చిత్రీకరించేవారు. సీన్ ముగిసిన తరువాత మరో టేక్ చేద్దామనేవారు.

ఇలా ఒక సీన్ ఏడెనిమిది సార్లు చిత్రీకరించేవారు. ఆ సమయంలో నేను ఏడ్చేశాను. అలా ఎక్కువసార్లు టేక్స్ తీసుకుంటున్నందుకు తనను తప్పుగా అనుకోవద్దని సీన్ మరింత అందంగా రావడం కోసమే అలా చేస్తున్నట్లు అనురాగ్ చెప్పేవారు. నువ్ నన్ను అసహ్యించుకుంటున్నావని తెలుసు కానీ దయచేసి అలా అనుకోకు.. సిరీస్ విడుదలైన తరువాత ఆ సీన్లు చూసి చాలా బాగా తీశారని నువ్వే అనుకుంటావని అనురాగ్ చెప్పేవారని'' కుబ్రా సైత్ చెప్పుకొచ్చింది. 
 

click me!