రాధగా అనుపమా పరమేశ్వరన్‌ కనువిందు.. `కార్తికేయ2`లో ఫిక్స్

By Aithagoni RajuFirst Published Aug 30, 2021, 5:19 PM IST
Highlights

 ప్రస్తుతం అనుపమా నిఖిల్‌తో `18పేజెస్‌` చిత్రంలో నటిస్తుంది. `కుమారి 21 ఎఫ్‌` ఫేమ్‌ పల్నాటి సూర్య ప్రతాప్‌ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతుంది. దీంతోపాటు అనుపమా మరో సినిమాలో నిఖిల్‌తో నటించబోతున్నట్టు తెలుస్తుంది.
 

అనుపమా పరమేశ్వరన్‌ నెమ్మదిగా సినిమా ఛాన్స్ లు పెంచుకుంటోంది. గతేడాది ఈ అమ్మడి చేతిలో ఒక్క సినిమా కూడా లేదనే టాక్ వచ్చింది. కానీ సెలెంట్‌గా ఆఫర్స్ దక్కించుకుంటూ జాబితా పెంచుకుంటోంది. ప్రస్తుతం అనుపమా నిఖిల్‌తో `18పేజెస్‌` చిత్రంలో నటిస్తుంది. `కుమారి 21 ఎఫ్‌` ఫేమ్‌ పల్నాటి సూర్య ప్రతాప్‌ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతుంది. దీంతోపాటు అనుపమా మరో సినిమాలో నిఖిల్‌తో నటించబోతున్నట్టు తెలుస్తుంది.

నిఖిల్‌.. చందూమొండేటి దర్శకత్వంలో `కార్తికేయ2` చిత్రంలో నటిస్తున్నారు. గతంలో వచ్చిన `కార్తికేయ`కిది సీక్వెల్‌. అందులో నిఖిల్‌, కలర్స్ స్వాతి జంటగా నటించారు. కానీ ఇప్పుడు సీక్వెల్‌లో హీరోయిన్‌గా అనుపమా కనిపించబోతుందని టాక్. తాజాగా చందూమొండేటి ఓ హీరోయిన్‌ ముఖాన్ని తన చేతులతో మూసేస్తూ ఫజిల్‌ పెట్టాడు. ఇందులో హీరోయిన్‌ని మరి కాసేపట్లో రివీల్‌ చేయబోతున్నారు.  అయితే ఆ హీరోయిన్‌ అనుపమనే అనే ఆమె కర్లీ హెయిర్‌ చూస్తుంటే అర్థమైపోతుంది. 

మరోవైపు రాధగా మారింది అనుపమా పరమేశ్వరన్‌. నేడు(సోమవారం) కృష్ణాష్టమి సందర్భంగా అనుపమా పరమేశ్వరన్‌, కొమలి ప్రసాద్‌ కలిసి రాధాకృష్ణుల వేషం ధరించి ఫోటోలకు పోజులిచ్చారు. ఇందులో కోమలి ప్రసాద్‌ కృష్ణుడిగా కనిపిస్తుండగా, రాధగా మాత్రం అనుపమా కనిపిస్తూ ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం ఈ పిక్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది.

click me!