భూమి కోసం... తండ్రికొడుకులను కర్రలతో చితకబాదిన ప్రత్యర్ధులు

Arun Kumar P   | Asianet News
Published : Feb 05, 2020, 09:51 PM ISTUpdated : Feb 05, 2020, 10:14 PM IST
భూమి కోసం... తండ్రికొడుకులను కర్రలతో చితకబాదిన ప్రత్యర్ధులు

సారాంశం

భూమి కోసం చెలరేగిన వివాదం ఓ రైతు ప్రాణాలను బలితీసుకోవడమే కాదు అతడి కొడుకును చావుబ్రతుల్లోకి నెట్టింది. 

కర్నూలు జిల్లా అవుకు మండలం లోని చనుగొండ్ల గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. భూ వివాదం ఓ వ్యక్తి హత్యకు దారితీసింది. చిన్న పుల్లారెడ్డి అనే వ్యక్తిని ప్రత్యర్థులు కర్రలతో కొట్టి చంపడమే కాదు అడ్డు వచ్చిన అతడి కుమారుడు శివారెడ్డికి తీవ్ర గాయాలయ్యాయి.

చనుగొండ్ల గ్రామంలోని సర్వేనెంబర్ 105 లో నాలుగు ఎకరాల ఇరవై సెంట్లు పొలం ఉంది. ఈ పొలంపై చిన్న పుల్లారెడ్డి కి అదే గ్రామానికి చెందిన ఓబుల్ రెడ్డికి భూ వివాదం నెలకొని ఉంది. దీంతో ఈ భూమికోసం తరచూ గొడవలు జరిగేవి.

ఈ క్రమంలోనే బుధవారం ఉదయం చిన్న పుల్లారెడ్డి అతని కొడుకు శివారెడ్డిలు పొలం వద్దకు వెళ్లారు. అదే సమయంలో  చిన్న ఓబుల్ రెడ్డి,  పరమేశ్వర్ రెడ్డి చెన్నకేశవరెడ్డి, మోహన్ రెడ్డిలు కట్టెలతో తీసుకొని వారిపై దాడి చేశారు. ఈ ఘర్షణలో చిన్న పుల్లారెడ్డి తీవ్రంగా గాయపడి ఆసుపత్రికి తరలించే లోపే మార్గమధ్యలో మృతిచెందాడు.

శివారెడ్డి కూడా ఈ దాడిలో గాయపడ్డాడు. అయితే అతడు ప్రస్తుతం హాస్పిటల్ చికిత్స పొందుతున్నాడు. అతడి పరిస్థికి కూడా విషమంగా వున్నట్లు డాక్టర్లు తెలిపారు. ఇప్పుడే అతడి పరిస్థితి గురించి చెప్పలేమన్నారు. 

ఈ ఘటనపై సమాచారం అందుకున్న అవుకు ఎస్ఐ  శ్రీకాంత్ రెడ్డి సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరక్కుండా పోలీసులు పరిస్థితిని సమీక్షించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నట్లు పోలీసులు తెలిపారు. 

బనగానపల్లె ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకుని చికిత్స పొందుతున్నబాధితుడు శివారెడ్డిని పరామర్శించారు. దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని ఆయన కోరారు.

PREV
click me!

Recommended Stories

హైదరాబాద్ లో బుధవారం నీటి సరఫరా బంద్.. ఈ ప్రాంతాల ప్రజలు ముందే జాగ్రత్తపడండి
Jubilee Hills లో కాంగ్రెస్ గెలవడానికి టాప్ 10 రీజన్స్ ఇవే...