టీడీపీకి మరో నేత గుడ్ బై చెప్పారు. తూర్పు గోదావరి జిల్లాకు చెందిన తోట త్రిమూర్తులు టీడీపీకి రాజీనామా చేశారు. ఆయన అధికార పార్టీలో చేరాలని నిర్ణయం తీసుకొన్నారు.
రామచంద్రాపురం: మాజీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు శుక్రవారం నాడు టీడీపీకి రాజీనామా చేశారు. ఈ నెల 18వ తేదీన వైఎస్ఆర్సీపీలో చేరనున్నట్టు ఆయన ప్రకటించారు.
శుక్రవారంనాడు తోట త్రిమూర్తులు కార్యకర్తలతో భేటీ అయ్యారు. కార్యకర్తల సమావేశంలో తాను టీడీపీకి రాజీనామా చేస్తున్నట్టుగా ఆయన ప్రకటించారు. ఈ నెల 18వ తేదీన వైఎస్ఆర్సీపీలో చేరనున్నట్టుగా ఆయన స్పష్టం చేశారు. వైఎస్ఆర్సీపీ తూర్పు గోదావరి జిల్లా అధ్యక్ష పదవిని తోట త్రిమూర్తులు ఆశిస్తున్నారు.ఈ నెల 18వ తేదీన తోట త్రిమూర్తులు వైఎస్ఆర్సీపీలో చేరనున్నారు.సీఎం జగన్ సమక్షంలో ఆయన వైఎస్ఆర్సీపీ కండువా కప్పుకోనున్నారు.
గెలుపు ఓటములతో సంబంధం లేకుండా ప్రజల మనసులను గెలిచినట్టుగా ఆయన చెప్పారు. తాను టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో కొన్ని అభివృద్ధి కార్యక్రమాలను కోరిన సమయంలో ఆనాటి ప్రభుత్వం సహకరించలేదని తోట త్రిమూర్తులు ఆరోపించారు.
తన నియోజకవర్గంలో రోడ్డు నిర్మాణానికి జీవో విడుదల చేసినా కూడ నిధులు మంజూరు చేయని విషయాన్ని తోట త్రిమూర్తులు గుర్తు చేశారు. తన ఓటమికి టీడీపీ ప్రభుత్వం సహకరించని కారణమని ఆయన చెప్పారు. తన నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు నిధులు ఇవ్వాలని బాబును కోరినా కూడ ఆయన పట్టించుకోలేదని తోట త్రిమూర్తులు ఈ సమావేశంలో విమర్శలు చేశారు.
కార్యకర్లల సమావేశానికి కంటే ముందుగానే మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రు ఈ విషయమై శుక్రవారం నాడు జరిపిన చర్చలు విఫలమయ్యాయి. తాను పార్టీ మారాలని తీసుకొన్న నిర్ణయంలో ఎలాంటి మార్పు లేదని తోట త్రిమూర్తులు స్పష్టం చేసినట్టుగా సమాచారం.
ఈ ఎన్నికల ఫలితాల తర్వాత ఇటీవల కాపు సామాజిక వర్గానికి చెందిన టీడీపీ నేతలు కాకినాడలో సమావేశం నిర్వహించడంలో తోట త్రిమూర్తులు కీలకంగా వ్యవహరించారనే ప్రచారం కూడ లేకపోలేదు.
2014 ఎన్నికలకు ముందు తోట త్రిమూర్తులు కాంగ్రెస్ నుండి టీడీపీలో చేరారు. రామచంద్రాపురం నుండి ఆయన టీడీపీ అభ్యర్ధిగా పోటీ చేసి విజయం సాధించారు. ఈ ఏడాది ఏప్రిల్ మాసంలో జరిగిన ఎన్నికల్లో అదే స్థానం నుండి టీడీపీ అభ్యర్ధిగా పోటీ చేసి వైఎస్ఆర్సీపీ అభ్యర్ధి చేతిలో ఓటమి చెందాడు.
ఎన్నికలకు ముందే తోట త్రిమూర్తులు పార్టీ మారుతారనే ప్రచారం సాగింది. కారణాలుఏవో తెలియదు కానీ ఆయన టీడీపీ అభ్యర్ధిగానే పోటీ చేశారు. టీడీపీని వీడి వైఎస్ఆర్సీపీలో చేరాలని ఆయన నిర్ణయం తీసుకొన్నారని సమాచారం.
ఇదిలా ఉంటే రామచంద్రాపురం నియోజకవర్గంలో దశాబ్దాలుగా పిల్లి సుభాష్ చంద్రబోస్ కు, తోట త్రిమూర్తులుకు మధ్య వైరం ఉంది.పిల్లి సుభాష్ చంద్రబోస్ కూడ తోట త్రిమూర్తులు పార్టీలో చేరికకు పిల్లి సుభాష్ చంద్రబోస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా చెబుతున్నారు. ఈ కారణంగానే ఆయన వైఎస్ఆర్సీపీలో చేరికకు జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా చెబుతున్నారు.
సంబంధిత వార్తలు
జ్యోతుల నెహ్రు బుజ్జగింపులు వృధా: వైసీపీలోకి తోట త్రిమూర్తులు
చంద్రబాబుకు తెలుగు తమ్ముళ్లు ఝలక్: మురళీమోహన్ కోడలు కూడా.....
టీడీపీకి మరో ఎదురుదెబ్బ: వైసీపీలోకి మాజీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు...?
బీజేపీ నుంచి ఆహ్వానాలు అందుతున్నాయి: తేల్చేసిన తోట త్రిమూర్తులు
చంద్రబాబుకు తలనొప్పి: టీడీపీలో ప్రజావేదిక చిచ్చు
మేము ఏ పార్టీలోకి వెళ్లడం లేదు: తోట త్రిమూర్తులు
బీజేపీలో రాజ్యసభ ఎంపీల చేరిక చంద్రబాబుకు ముందే తెలుసు
టీడీపీతోనే ఉంటా: రాజకీయాల్లో విలువలు లేవు, సుజనాపై ప్రత్తిపాటి ఫైర్
మేం వేరు: వెంకయ్యకు టీడీపీ రాజ్యసభ ఎంపీల లేఖ
టీడీపీ ఖాళీయే: బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు
బీజేపీలోకి టీడీపీ ఎంపీలు.. మేం ఎవరిని ఆకర్షించలేదు: జీవీఎల్
ఏపీ టీడీపీలో ముసలం: ఎంపీల వ్యవహారం తెలియదన్న కళా వెంకట్రావ్
టీడీపీపై నమ్మకం పోయింది.. పురందేశ్వరి
సంక్షోభం కొత్త కాదు: సీనియర్ నేతలకు బాబు ఫోన్
స్పీకర్ను కలిసిన టీడీపీ లోక్సభ ఎంపీలు: మతలబు?
మేము ఏ పార్టీలోకి వెళ్లడం లేదు: తోట త్రిమూర్తులు