
హైదరాబాద్: విశాఖపట్నం విమానాశ్రయంలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ పై దాడిపై ఆ పార్టీ అనుమానం వ్యక్తం చేసింది. పథకం ప్రకారం దాడి చేసి ఉంటారని ఆ పార్టీ ఆరోపించింది. ప్రతిపక్ష నేతకు భద్రత కల్పించడంలో ప్రభుత్వ వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోందని వైసీపీ విమర్శించిది.
కోడి పందాలతో దాడి చేయడం చూస్తుంటే అనుమానం కలుగుతోందని ట్విట్టర్ లో పేర్కొంది. మరోవైపు ఏపీ ప్రభుత్వమే దాడి చేయించిందని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. అయితే ఏపీ ప్రభుత్వం వైసీపీ వాదనను తీవ్రంగా ఖండించింది. జగన్పై దాడిని ఖండిస్తున్నామని, ఘటనపై పూర్తిస్థాయిలో దర్యాప్తు జరిపిస్తామని అధికార పార్టీ స్పష్టం చేసింది.
ఈ వార్తలు కూడా చదవండి
జగన్పై జరిగిన దాడిపై అనుమానాలు...జ్యుడిషియల్ ఎంక్వయిరీ చేయాలి: జీవిఎల్
నిందితుడు జగన్ అభిమాని.. పబ్లిసిటీ కోసమే దాడి: ఏపీ డీజీపీ
విశాఖ ఎయిర్ పోర్టును చుట్టుముట్టిన వైసీపీ కార్యకర్తలు, ఉద్రిక్తత
విశాఖ విమానాశ్రయంలో వైఎస్ జగన్ పై దాడి (వీడియో)
జగన్ పై కత్తితో దాడి కుట్రేనా....నిందితుడి జేబులో లేఖ
వైఎస్ జగన్పై దాడి: ఖండించిన మంత్రి జవహర్
జగన్ పై దాడి... గంటలో నిజాలు తేలుస్తాం.. చినరాజప్ప