తెలంగాణ అమ్మాయిలతో ఏపీలో వ్యభిచారం... భీమవరంలో గలీజ్ దందా (వీడియో)

By Arun Kumar PFirst Published Sep 4, 2023, 10:00 AM IST
Highlights

సెలూన్, మసాజ్ సెంటర్ ముసుగులో గుట్టుగా వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠాను భీమవరం పోలీసులు పట్టుకున్నారు. 

భీమవరం : మసాజ్ ముసుగలో వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠాను భీమవరం పోలీసులు అరెస్ట్ చేసారు. యువతులతో క్రాస్ మసాజ్ అంటూ కస్టమర్లను ఆకర్షించి గుట్టుగా వ్యభిచారం సాగిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. దీంతో సదరు మసాజ్ సెంటర్ పై దాడిచేసి సెక్స్ వర్కర్లతో పాటు నిర్వహకులు, విటుడిని అదుపులోకి తీసుకున్నారు. 

పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం జువ్వలపాలెం రోడ్డులో గ్రేస్ సెలూన్ మరియు మసాజ్ సెంటర్ నిర్వహిస్తున్నారు. అయితే ఇది పేరుకే సెలూన్, మసాజ్ సెంటర్... లోపలంతా గలీజ్ పనులు జరుగుతుండేవి. ఇలా కొత్తకొత్త అమ్మాయిలు ఆ మసాజ్ సెంటర్ లో పనికోసమంటూ వస్తుండటంతో అనుమానం వచ్చిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో సదరు మసాజ్ సెంటర్ పై నిఘా వుంచిన పోలీసులు వ్యభిచారం జరుగుతున్నట్లు వచ్చిన సమాచారం నిజమేనని నిర్దారించుకున్నారు. 

వీడియో

భీమవరం సీఐ గుత్తుల శ్రీనివాస్ సిబ్బందితో కలిసి సదరు సెలూన్ ఆండ్ మసాజ్ సెంటర్ లో ఆదివారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. దీంతో హైదరాబాద్ కు చెందిన ఇద్దరు,విజయవాడ, ఏలూరుకు చెందిన ఒక్కో మహిళా సెక్స్ వర్కర్ పట్టుబడ్డాడు. అలాగే వ్యభిచారం నిర్వహిస్తున్న ఇద్దరు మహిళలు, ఓ విటుడిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే ప్రధాన నిర్వహకుడు పరారీలో వున్నాడని... అతడికోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Read More   స్పా సెంటర్ల ముసుగులో వ్యభిచారం.. బంజారాహిల్స్, ఫిల్మ్ నగర్ లలో పలువురి అరెస్ట్.. 

పట్టుబడిన సెక్స్ వర్కర్లను రెస్క్యూ హోంకు తరలించారు పోలీసులు. నిర్వహకులు, విటుడిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. మరికొన్ని మసాజ్ సెంటర్లు, సెలూన్లలో కూడా పోలీసుల తనిఖీలు కొనసాగాయి. 

click me!