గుంటూరులో దారుణం.. ఇంజినీరింగ్ విద్యార్థినిపై అత్యాచారయత్నం..

By AN TeluguFirst Published Oct 23, 2021, 2:20 PM IST
Highlights

మోతడకలోని ఓ ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థి తన స్నేహితులతో కలిసి బైక్ పై గుంటూరు వెళ్తున్న సమయంలో కొందరు యువకులు వారిపై కర్రలతో దాడి చేశారు. 

గుంటూరు : తాడేపల్లిలో జరిగిన గ్యాంగ్ రేప్ కేసు మరవకముందే.. గుంటూరులో అలాంటి దారుణమే జరగబోయింది. గుంటూరు నగర శివారులో ఇంజినీరింగ్ విద్యార్థినిపై rape Attempt కలకలం రేపింది. గురువారం రాత్రి జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 

మోతడకలోని ఓ ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థి తన స్నేహితులతో కలిసి బైక్ పై గుంటూరు వెళ్తున్న సమయంలో కొందరు యువకులు వారిపై కర్రలతో దాడి చేశారు. 

యువతిని చెట్ల పొదల్లోకి తీసుకెళ్లేందుకు యత్నించారు. యువతి , యువకుడు గట్టిగా కేకలు వేయడంతో నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు.

తాడేపల్లి ఘటన...
కాగా, జూన్ 19న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లా తాడేపల్లి పరిధిలో గల సీతానగరం పుష్కరఘాట్ వద్ద ప్రేమజంటపై అత్యాచారం కేసు రాష్ట్ర వ్యాప్తంగా సంచనలం రేపింది. ఈ కేసును ఛేదించడానికి పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. ఘటన జరిగిన రోజు ప్రేయసీప్రియులు రాత్రి 8.30 గంటలకు Pushkarghat కు చేరుకున్నారు. 

బాధితురాలు నర్సుగా పనిచేస్తోంది. తనకు పరిచయం ఏర్పడిన యువకుడితో పరిచయం ప్రేమగా మారింది. తమ ప్రేమ గురించి ఇద్దరు తమ కుటుంబాలకు చెప్పారు. వారు పెళ్లికి అంగీకరించారు. దీంతో ఇరువురు తరుచుగా కలుసుకుంటూ వస్తున్నారు. 

ఘటన జరిగిన రోజు యువకుడు ప్రేయసికి ఫోన్ చేశాడు. దాంతో డ్యూటీ ముగిసిన వెంటనే బాధితురాలు యువకుడిని కలుసుకుంది. వారిద్దరు పుష్కర ఘాట్ కు చేరుకున్నారు.  ఆ సమయంలో దుండగులు వారిని చూశారు. 

జగన్ రెడ్డిది స్పెషల్ క్యారెక్టర్...ఆయనకు విలన్ అనే పేరు చిన్నది.. చంద్రబాబు

యువకుడి కాళ్లూ చేతులూ కట్టేసి యువతిపై gang rape చేశారు. దానికి ముందు వారు మాటలను యువతి సెల్ లో రికార్డు చేసింది. ఆ రికార్డును పోలీసుులు పరిశీలిస్తున్నారు.  సమయం గడుస్తున్నా తమ కూతురు ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు. 

ఫోన్ చేస్తే కలువలేదు. చివరకు రాత్రి 11 గంటలకు యువతి ఫోన్ నుంచి కుటుంబ సభ్యులకు ఫోన్ వచ్చింది. ఏడుస్తూ ఆమె వారితో మాట్లాడింది. యువతిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ క్రమంలో నిందితుల్లో ఒకడి ఫొటో పోలీసుల చేతికి చిక్కినట్లు తెలుస్తోంది. 

ఇదిలావుంటే, సీతానగరం పుష్కరఘాట్ వద్ద ప్రేమ జంటపై జరిగిన అఘాయిత్యం కేసులో ప్రకాశం బ్యారేజీ దిగువ భాగాన మహానాడు సమీపంలోని రైల్వే వంతెన కింద నిందితులు యువతిపై సామూహిక అత్యాచారం చేసి నాటు పడవపై విజయవాడ వైపు వెళ్లినట్లు బాధితులు తెలిపారు. 

అప్పటికే చీకటి పడడంతో నిందితులను గుర్తించడం వారికి కష్టమైందని పోలీసులు తెలిపారు. యువతితో పాటు యువకుడిని పోలీసులు తమ వెంట తీసుకుని వెళ్లి రెండు జిల్లాల్లోని అనుమానితులను చూపించారు. 

కేసు దర్యాప్తులో భాగంగా అనంతరం తాడేపల్లి అత్యాచారం కేసులో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు పోలీసులు. ఏ 1 కృష్ణ, ఏ3 హబీబ్‌ను అరెస్ట్ చేశారు. పరారీలో వున్న ఏ 2 వెంకట్‌ కోసం వెతుకుతున్నారు. అత్యాచార ఘటనకు గంట ముందు ఏ 1 కృష్ణ ఒక హత్య చేసినట్లుగా పోలీసులు చెబుతున్నారు. 

click me!