విజయవాడ : పోలి స్నానానికి పోటెత్తిన భక్తులు (వీడియో)

Dec 8, 2018, 10:04 AM IST

కార్తీక మాసం చివరి రోజు విజయవాడలో కృష్ణానదికి భక్తులు పోటెత్తారు. పెద్ద సంఖ్యలో కృష్ణానదికి చేరుకుని పుణ్యస్నానాలు ఆచరించారు. పోల్ అమావాస్య సందర్భంగా నదిలో దీపాలను వదిలి పూజలు చేశారు. కార్తీక మాసం నెలరోజుల్లో పూజలు చేయని భక్తులు ఈ ఒక్కరోజు 31ఒత్తులతో అరటిడొప్పల్లో దీపాలను నదిలోకి వదిలితే ఆయురారోగ్యాలతో ఉంటారనేది భక్తుల విశ్వాసం. అందుకే పెద్ద సంఖ్యలో భక్తులు కృష్ణానదికి తరలివస్తున్నారు.