EWS reservation: నీట్ పీజీ అడ్మిషన్లలో ఆర్థికంగా వెనుకబడిన వారి (ఈడబ్ల్యూఎస్) కోటాపై తీర్పును రిజర్వులో ఉంచుతున్నట్టు సుప్రీం కోర్టు పేర్కొంది. గత రెండురోజులుగా ఈ అంశం మీద వాద ప్రతివాదనలు వింటున్నామని, ధీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని కౌన్సెలింగ్ ప్రక్రియను ప్రారంభించాల్సిన అవసరం ఉం దని స్పష్టం చేసింది. పిటిషనర్లు, ప్రతివాదులు తమ ప్రతిపాదనలను రాతపూర్వకంగా కోర్టుకు సమర్పించాలని ధర్మాసనం సూచించింది.