PM Modi Europe Tour: డిజిటల్ చెల్లింపులో భారతదేశం 40 శాతం భాగస్వామ్యమని బెర్లిన్లో ప్రధాని మోదీ అన్నారు. భారత్ కు అత్యంత వేగవంతమైన ఇంటర్నెట్ కనెక్టివిటీ ఉందని తెలిపారు. 2014 నాటికి భారత్ లో కేవలం 200-400 స్టార్టప్ లు ఉంటే.. నేడు 68,000 స్టార్టప్లు, డజన్ల కొద్దీ యునికార్న్లకు నిలయంగా మారిందని, వారిలో కొందరు ఇప్పటికే 10 బిలియన్ డాలర్ల వాల్యుయేషన్తో డెకా-కార్న్స్గా మారారని ప్రధాని మోడీ అన్నారు.