Vijayawada: వచ్చే మూడు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ లో సాధారణం నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) అంచనా వేసింది. రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించిన ఐఎండీ.. కృష్ణా, గుంటూరు, పార్వతీపురం, శ్రీకాకుళం, అల్లూరి, ఏలూరు, బాపట్ల జిల్లాల్లో రానున్న మూడు రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది.