Nitish Kumar: ఇండియా కూటమిపై బీహార్ సీఎం, జేడీయూ అధినేత నితీశ్ కుమార్ తీవ్ర విమర్శలు గుప్పించారు. మహాఘట్ బంధన్కు గుడ్ బై చెప్పి.. బీజేపీ మద్దతుతో మళ్లీ సీఎం అయిన నితీశ్ కుమార్.. ఇండియా కూటమిని విమర్శించారు. ఈ నేపథ్యంలోనే అసలు ప్రతిపక్షాలు అన్నీ కలిసి ఏర్పడిన కూటమికి ఇండియా అనే పేరు పెట్టడంపై తన అభిప్రాయాన్ని వెల్లడించారు.ఈ క్రమంలోనే రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీలే లక్ష్యంగా సంచలన ఆరోపణలు చేశారు.