Medigadda Barrage: కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలో మేడిగడ్డ వద్ద నిర్మించిన లక్ష్మీ బ్యారేజీ వంతెన కొంతభాగం శనివారం (అక్టోబర్ 21) రాత్రి కుంగిపోయింది. 20వ పిల్లర్ కుంగిపోవడంతో బ్యారేజీ గేటు విరిగిపోయింది. లక్ష్మీ బ్యారేజీకి నీటి ప్రవాహం కొనసాగుతోంది. అధికారులు 57 గేట్లను ఎత్తి 45,260 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. బ్యారేజీకి ఇన్ ఫ్లో 12,240 క్యూసెక్కులుగా ఉంది. ఇప్పటికే నిపుణుల కమిటీ ఏర్పాటు చేయగా, మేడిగడ్డ బ్యారేజీ దగ్గర 144 సెక్షన్ విధిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.