Kompella Madhavi Latha: తెలంగాణలో లోక్ సభ ఎన్నికల హడావుడి షూరు అయ్యింది.ఏ పార్టీ అభ్యర్థి అయినా గెలుపే పరమావధిగా ప్రచారం జోరుగా సాగిస్తున్నారు. ఇక ఇవాళ నామినేషన్లు దాఖలు చేయడానికి చివరి రోజు. దీంతో అభ్యర్థులు పోటా పోటీగ నామినేషన్లు దాఖలు చేశారు. ఇక బీజేపీ ఎంపీ అభ్యర్థి కొంపెల్ల మాధవీ లత కూడా ఇవాళ నామినేషన్ వేశారు.
సినీ నటి మాధవీలత తనదైన వ్యాఖ్యలతో నిత్యం వివాదాల్లో నిలుస్తూ ఉంటారు. అయితే తాను జనసేన అధ్యక్షుడు, ప్రముఖ సినీ నటుడు పవన్ కల్యాణ్ (Pawan Kalyan) అభిమాని అని చెప్పుకునే మాధవీలత (Madhavi Latha) తాజాగా ఆయననే టార్గెట్ చేసుకుని సంచలన వ్యాఖ్యలు చేశారు.