హమాస్ను నాశనం చేయడమే తమ లక్ష్యం అని ఇజ్రాయెల్ సైన్యాన్ని గాజా సరిహద్దులో భారీగా మోహరింపజేసింది. గాజా పట్టిలో గాజా పట్టణం ఉన్న ఉత్తర గాజా నుంచి దక్షిణ గాజాకు పౌరులు వెళ్లిపోవాలని ఇజ్రాయెల్ 24 గంటల గడువు ఇచ్చింది. ఉత్తరాదిన ఉన్న 11 లక్షల మంది పౌరులు ఈ స్వల్ప అవధిలో దక్షిణాది వైపు వెళ్లడం అసాధ్యం అని, ఇజ్రాయెల్ ఈ గడువు బూచీతో విధ్వంసానికి తెరలేపాలనే ప్రణాళికలో ఉన్నదని, అది జాతి హననానికి పాల్పడాలని చూస్తున్నదని విమర్శకులు ఆరోపిస్తున్నారు.