రాష్ట్రంలో ఇంటింటా జలుబు, దగ్గు, జ్వరం, గొంతు నొప్పి, ఒళ్లు నొప్పుల సమస్యలు తీవ్రంగా బాధిస్తున్నాయి. ప్రభుత్వం చేపట్టిన సర్వేలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఓపీ సేవలో ఈ విషయాన్ని గుర్తించారు. కేవలం తొమ్మిది రోజుల వ్యవధిలోనే మొత్తం 4,00,283మందిలో కరోనా లక్షణాలు ఉన్నట్లు సర్వే ద్వారా గుర్తించారు అధికారులు. మొత్తం 90 లక్షల పైగా ఇళ్లలోనూ ఆసుపత్రి ఓపిల్లో మరో 6.58 లక్షల మందిని పరిశీలించగా పై విషయం నిర్ధారణ అయింది.