Israel-Palestine conflict: ఇజ్రాయెల్-పాలస్తీనా వివాదం నేపథ్యంలో కొనసాగుతున్న యుద్ధంపై యావత్ ప్రపంచం ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఇజ్రాయెల్ చరిత్రలోనే అత్యంత దారుణమైన దాడితో మృతుల సంఖ్య 1,200కు పైగా పెరగ్గా, గాజా అధికారులు ఇప్పటివరకు 900 మంది మరణించినట్లు ప్రకటించారు. ఇజ్రాయెల్ లో సుమారు 1,500 మంది హమాస్ ఉగ్రవాదుల మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్లు ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది. అయితే, మానవ హక్కులను గౌరవించాలని ముస్లిం నేతల పిలుపు నిస్తున్నారు.