Asianet News TeluguAsianet News Telugu

కరీంనగర్ గుట్టల్లో కుళ్లిన స్థితిలో యువతి శవం.. రేప్ చేసి చంపేసిన ప్రియుడు (వీడియో)

యువతి హత్యకు ప్రేమ వ్యవహారమే కారణమై ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. హత్య జరిగిన విధానం, అనుమానితులను బట్టి... కాగా ఈ హత్య కేసులో నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హత్యకు గల కారణాల మీద పోలీసులు విచారణ చేపట్టారు. 

Young woman brutally murdered in Karimnagar
Author
Hyderabad, First Published Jan 8, 2022, 11:02 AM IST

కరీంనగర్ : Karimnagar జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. జిల్లాలోని మానకొండూరు మండలం చెంజర్ల గ్రామ శివారులో గల గుట్టలో Young woman brutally murderకు గురైంది. యువతి dead bodyని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు మొదలు పెట్టారు. శవం కుళ్లిపోయిన స్థితిలో కనిపించింది. 

"

కాగా యువతి హత్యకు love affair కారణమని పోలీసులు గుర్తించారు. హత్య జరిగిన విధానం, అనుమానితులను బట్టి... కాగా ఈ హత్య కేసులో నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హత్యకు గల కారణాల మీద పోలీసులు విచారణ చేపట్టారు. ప్రియుడు అఖిల్ ను పోలీసులు అదుపుల ోకి తీసుకుని విచారించారు. అతను పోలీసుల ఎదుట నేరం అంగీకరించినట్లు సమాచారం.

మానకొండూరు మండలం చెంజర్ల గ్రామ శివారులో గల గుట్టల్లో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తిమ్మాపూర్ మండలం మన్నెంపల్లి గ్రామానికి చెందిన ఓ యువతికి.. పక్క గ్రామమైన పోరండ్ల గ్రామానికి చెందిన ఆశోద అఖిల్ అనే యువకుడితో గత ఐదేళ్లుగా ప్రేమ వ్యవహారం నడుస్తోంది. కాగా వీరిద్దరూ పెళ్లి చేసుకుందామనుకున్నారు. అయితే వీరి పెళ్లికి వయస్సు అనేది అడ్డు వచ్చింది. ఇద్దరు కూడా మైనర్లు.

దీంతో రెండు సంవత్సరాలుగా ఇద్దరు దూరంగా ఉంటున్నారు. కాగా, ఇటీవల ప్రేమికుడు మళ్లీ అమ్మాయికి దగ్గరయ్యాడు. మాటలు కలుపుతూ మెల్లిగా అమ్మాయిని లొంగదీసుకున్నాడు. ఆ తరువాత ఆమెను పథకం ప్రకారం హత్య చేశాడు. అయితే, వారం రోజుల క్రితం ఇంటి నుండి వెళ్లిన అమ్మాయి దొరకకపోవడంతో.. తల్లిదండ్రులు అంతా వెతికి తప్పిపోయిందంటూ ఎల్ఎండి పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. 

మానకొండూరు మండలం పొరండ్ల గుట్టల్లో శవం లభ్యం కావడంతో.. దాన్ని గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు యువతి మృతదేహాన్ని.. తమ దగ్గర నమోదైన మిస్సింగ్ కేసుగా అనుమానించి.. ఆ దిశగా దర్యాప్తు చేశారు. చివరికి మన్నె పల్లీ గ్రామానికి చెందిన యువతి మృతదేహంగా గుర్తించారు. 

దాదాపు వారం రోజుల్లో కిందే ప్రియుడు.. యువతిని పోరండ్ల గుట్టల్లోకి లాక్కెళ్లి.. అత్యాచారం చేసి.. హత్య చేశాడని తేలింది. హత్య జరిగి వారం రోజులు కావడంతో శవం కుళ్లిపోయిన స్థితిలో కనిపించింది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పోరండ్ల గ్రామానికి చెందిన నిందితుడు ఆశోద అకిల్ అదుపులోకి తీసుకుని ఎల్ఎండి పోలీసులు విచారణ చేపట్టారు.  ఈ హత్య కేస లో ఇంకా ఎవరికైనా ప్రమేయం ఉందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ఇదిలా ఉండగా, ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్తను మోసం చేశాడని తెలుసుకుని, ఎలాగోలా అతని ఆచూకీ పట్టుకుని పట్టుదలతో 42 రోజులుగా diksha చేసిన ఆ యువతి పోరాటం విఫలం అయ్యింది. భర్త Cheatingతో చివరికి శుక్రవారం తనువు చాలించిన సంఘటన పలువురిని కలచివేసింది. తనను భార్యగా స్వీకరించాలనే డిమాండ్ తో చేసిన పోరాటం ఆమె చివరికి భర్తకు మరో పెళ్లి అయిందని, పిల్లలు కూడా ఉన్నారని తెలుసుకుని పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. 

Follow Us:
Download App:
  • android
  • ios