Asianet News TeluguAsianet News Telugu

ప్రియుడితో కలిసి భర్త హత్య, యాక్సిడెంట్ గా కవరింగ్.. ఐదేళ్ల తరువాత అత్తకు అనుమానం రావడంతో...

సెప్టెంబర్ 20, 2016న భీమారం మండలం  రాంపూర్ సత్య సత్యరాజ్ రాత్రివేళ స్కూటీపై వెడుతుండగా పథకం ప్రకారం కారుతో ఢీ కొట్టి హత్య చేశారు. ఇలాంటి అనుమానం రాకుండా రోడ్డు ప్రమాదంగా  చిత్రీకరించారు.  ఐదేళ్ల తర్వాత కోడలి ప్రవర్తనలో మార్పు కనిపించడం తో సత్య రాజ్ తల్లి లక్ష్మికి అనుమానం మొదలయింది.

woman kills husband with lover in adilabad - bsb
Author
Hyderabad, First Published Jul 20, 2021, 3:22 PM IST

ఆదిలాబాద్‌ : ఐదేళ్ల క్రితం జిల్లాలోని భీమారం మండలం పోలంపల్లి సమీపంలో జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదం కేసును పోలీసులు ఛేదించారు.  రోడ్డు ప్రమాదంలో మరణించిన పాస్టర్ సత్యరాజ్ కేసునుకుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా నమోదు చేసుకున్నారు.

విచారణ అనంతరం పాస్టర్ భార్య మహేశ్వరి మరో మరో నలుగురిని సోమవారం అరెస్టు చేసి రోడ్డు ప్రమాదం కేసు హత్య కేసుగా మార్చారు. నిందితుల్లో మరొకరు పరారీలో ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. మంచిర్యాల డిసిపి ఉదయ్ కుమార్ రెడ్డి భీమారం పోలీస్ స్టేషన్లో వివరాలు వెల్లడించారు.

సెప్టెంబర్ 20, 2016న భీమారం మండలం  రాంపూర్ సత్య సత్యరాజ్ రాత్రివేళ స్కూటీపై వెడుతుండగా పథకం ప్రకారం కారుతో ఢీ కొట్టి హత్య చేశారు. ఇలాంటి అనుమానం రాకుండా రోడ్డు ప్రమాదంగా  చిత్రీకరించారు.  ఐదేళ్ల తర్వాత కోడలి ప్రవర్తనలో మార్పు కనిపించడం తో సత్య రాజ్ తల్లి లక్ష్మికి అనుమానం మొదలయింది.

తన కొడుకు రోడ్డు ప్రమాదంలో చనిపోలేదని, హత్య చేసి చంపారని ఆరు నెలల క్రితం భీమారం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. భీమారం పోలీసులు విచారణ జరిపిన అనంతరం సత్యరాజ్ భార్య మహేశ్వరి తో పాటు ఆమె సోదరుడు శ్రీకాంత్ ప్రియుడు గంగాధర్ మరో వ్యక్తి మల్లా రెడ్డిని అరెస్టు చేశారు.

 శ్రీరాంపూర్ కాలనీ సమీపంలోని అరుణ్ అక్క నగర్ వద్ద గల చర్చిలో పాస్టర్ గా పనిచేస్తున్న కర్నూలు సత్యరాజ్ 32 తో లక్సెట్టిపేట చర్చి ఫాదర్ కాముని గంగాధర్  కు  పరిచయం ఏర్పడింది. తరచూ సత్యరాజ్ ఇంటికి గంగాధర్ వెళ్లేవాడు. ఈ నేపథ్యంలో సత్య రాజ్ భార్య మహేశ్వర వివాహేతర సంబంధం ఏర్పడింది.  విషయం తెలిసిన సత్యరాజ్ ప్రవర్తన మార్చుకోవాలని మహేశ్వరి కి సూచించాడు. గంగాధర్ తో కూడా గొడవ పడ్డాడు.

తమ సంబంధానికి సత్యరాజ్ అడ్డుగా ఉన్నాడని భావించిన మహేశ్వరి, గంగాధర్ అతన్ని హత్య చేయాలని నిర్ణయం తీసుకున్నారు.  గంగాధర్ వాహనంతో ఢీకొట్టి హత్య చేయాలని పథకం రచించారు.  గంగాధర్ పేరుతో రిజిస్టర్ అయిన అయితే పోలీసుల విచారణలో తెలుస్తుందని గంగాధర్ స్నేహితుడు డు రమేష్ రెడ్డి సూచించగా కరీంనగర్ జిల్లా గొల్లపల్లికి చెందిన బోనగిరి మల్లారెడ్డి అమ్మినట్లు అగ్రిమెంట్ చేసుకున్నారు.

ఎగురుతున్న విమానంలోనే... హైదరాబాద్ యువతిపై కామారెడ్డి వాసి లైంగిక వేధింపులు (వీడియో)

ప్రణాళిక ప్రకారం దాంపూర్ కి స్కూటీపై సత్యరాజ్ ను పంపి వెనకాలే వెళ్లి ఢీకొట్టారు.  గాయాలపాలైన ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. ఎవరికీ అనుమానం రాకుండా మహేశ్వరి పోలీసులకు ఫిర్యాదు చేసింది.  తవేరా కొనుగోలు చేసిన బోనగిరి మల్లారెడ్డి 50 వేలు ఇచ్చి పోలీసుల వద్ద సరెండర్ చేశారు. రోడ్డు ప్రమాదంగా పోలీసులు కేసు నమోదు చేశారు. సత్యరాజ్ పెళ్లికి వచ్చిన అనుమానంతో ఆరు నెలల క్రితం తిరిగి విచారణ జరపగా హత్య గా తేలింది.

హత్య కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్లు డీసీపీ తెలిపారు. శ్రీరాంపూర్ సీఐ సంజీవ్, ఎస్ ఐ అశోక్ పరిశోధన జరిపి కేసును ఛేదించారు అని తెలిపారు.  నలుగురు అరెస్ట్ కాగా జగిత్యాలకు చెందిన రమేష్ రెడ్డి పరారీలో ఉన్నారన్నారు. హత్యకు ఉపయోగించిన టవేరా వాహనం తోపాటు అగ్రిమెంట్ స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. సమావేశంలో జైపూర్ ఏసిపి నరేందర్, సీఐ సంజీవ్, ఎస్ ఐ  అశోక్ పాల్గొన్నారు.  

Follow Us:
Download App:
  • android
  • ios