అనుమానాస్పద స్థితిలో వివాహిత మంటల్లో చిక్కుకుని సజీవ దహనమైంది. షార్ట్‌ సర్క్యూట్‌  కారణంగా ఈ అగ్ని ప్రమాదం జరిగిందని మొదట స్థానికులు భావించారు. కానీ భర్తే ఆమెను హత్య చేసి, పెట్రోల్ పోసి నిప్పంటించాడని మృతురాలి బంధువులు ఆరోపించారు. ఈ మేరకు పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. వనస్థలిపురంలో సోమవారం జరిగిన ఈ ఘటనపై పోలీసులు, మృతురాలి బంధువులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.

అనుమానాస్పద స్థితిలో వివాహిత మంటల్లో చిక్కుకుని సజీవ దహనమైంది. షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా ఈ అగ్ని ప్రమాదం జరిగిందని మొదట స్థానికులు భావించారు. కానీ భర్తే ఆమెను హత్య చేసి, పెట్రోల్ పోసి నిప్పంటించాడని మృతురాలి బంధువులు ఆరోపించారు. ఈ మేరకు పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. వనస్థలిపురంలో సోమవారం జరిగిన ఈ ఘటనపై పోలీసులు, మృతురాలి బంధువులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.

నల్గొండ జిల్లా మర్రిగూడ మండలం తమ్మడపల్లి గ్రామానికి చెందినచెల్లం బాలకృష్ణ ప్రభుత్వ ఉపాధ్యాయునిగా పని చేస్తున్నాడు. అతని మొదటి భార్య చనిపోవడంతో... నల్గొండ జిల్లా గిద్దలూరు మండలం గుంజాల గ్రామానికి చెందిన ఎర్ర సరస్వతి (42)ని 20 యేళ్ల ఏళ్ల క్రితం రెండో వివాహం చేసుకున్నాడు.

అనంతరం సరస్వతి ప్రభుత్వ టీచర్గా ఉద్యోగం రావడంతో భార్యాభర్తలు, ఇద్దరు పిల్లలతో కలిసి వనస్థలిపురంలో నివాసముంటున్నారు. బాలకృష్ణ మొదటి భార్యకు కుమారుడు వెంకటరమణ అనే కుమారుడు ఉన్నాడు. సరస్వతికి కూతురు అక్షిత (15) ఉంది. వనస్థలిపురంలోని ఎఫ్‌సీఐ కాలనీలో ఉన్న ఇల్లు సరస్వతి పేరు మీద ఉండగా... తన పేరుమీద రిజిస్టేషన్ చేయడానికి బాలకృష్ణ ఇటీవల ఒత్తిడి చేయడంతో ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి.

ఇదే క్రమంలో ఆదివారం రాత్రి వారిద్దరూ గొడవ పడ్డారని కూతురు అక్షిత పోలీసులకు తెలిపింది. సోమవారం ఉదయం కూడా మళ్ళీ గొడవ పడ్డారని తల్లిపై బాలకృష్ణ చేయి చేసుకున్నాడని అక్షిత పేర్కొంది. కొద్దిసేపటికి ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిన వెళ్లిన తన తండ్రి టిఫిన్ తీసుకొచ్చారని ఆ తర్వాత తాను ఆన్‌లైన్‌ క్లాస్‌లు వినేందుకు బెడ్‌రూంలోకి వెళ్లాను అని చెప్పింది. 

కొద్దిసేపటికే పెద్ద శబ్దం రావడంతో దాన్ని బయటికి వచ్చి చూడగా.. తన తల్లి మంటల్లో చిక్కుకుని కనిపించిందని, తనను దగ్గరకు రావద్దు అని చెప్పారు అని చెప్పింది. అప్పటికే తన తల్లి మొత్తం మంటల్లో కాలిపోయినట్లు అక్షిత చెప్పిందని పోలీసులు వివరించారు. 

పెళ్లైన మగాడిపై కన్నేసి... అతని భార్యను వేధించి..!...

సమాచారం అందుకున్న హయత్ నగర్ ఫైర్ స్టేషన్ సిబ్బంది వెంటనే అక్కడికి వచ్చి వచ్చి మంటలార్పారు. కాగా తాము సంఘటనా స్థలానికి చేరుకునే సరికి మృతురాలి భర్త బాలకృష్ణ స్వల్ప గాయాలతో 108 లో యశోద ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం చేరినట్లు సీఐ మురళీమోహన్ తెలిపారు. అక్షిత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

 తన చెల్లెల్ని ఆమె భర్త బాలకృష్ణ హత్యచేసి.. ఆపై పెట్రోల్ పోసి నిప్పంటించాడని మృతురాలి అక్కలు సులోచన, వెంకటమ్మ, రమణలు ఆరోపించారు. ఆస్తి విషయంలో గొడవలు జరుగుతున్నాయని, కొద్దికాలంగా సరస్వతిని బాలక్రిష్ణ తీవ్రంగా వేధిస్తున్నాడని వారు పేర్కొన్నారు. హత్య చేసి అగ్నిప్రమాదంగా చిత్రీకరించేందుకు కుట్ర పన్నారని, అతనిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.

సోమవారం ఉదయం సజీవ దహనం అయిన సరస్వతి ఆత్మహత్య చేసుకుందా, హత్య జరిగిందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నామని వనస్థలిపురం సీఐ మురళీ మోహన్ తెలిపారు. మృతురాలి పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశామని పెద్ద బాలకృష్ణను వివరించినట్లు తెలిపారు.