వికారాబాద్ జిల్లా పరిగి మండలం కాలాపూర్‌లో శిరీష అనే యువతిని చంపి నీటి గంతలో పడేశారు దుండగులు. అంతేకాదు హత్య తర్వాత ఆమె కళ్లను స్క్రూ డ్రైవర్‌తో చిధ్రం చేశారు. 

వికారాబాద్ జిల్లాలో యువతి దారుణహత్యకు గురైంది. పరిగి మండలం కాలాపూర్‌లో శిరీష అనే యువతిని చంపి నీటి గంతలో పడేశారు దుండగులు. అంతేకాదు.. ఆమెను హత్య చేసిన తర్వాత కళ్లను స్కూడ్రైవర్‌తో చిధ్రం చేశారు. రెండ్రోజులుగా శిరీష కనిపించకుండాపోయింది. దీనిపై ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. శిరీష హత్యపై మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.