Asianet News TeluguAsianet News Telugu

భర్త మృతిని తట్టుకోలేక భార్య ఆత్మహత్య: అనాధలైన ఇద్దరు చిన్నారులు

 ప్రేమించి పెళ్లి చేసుకొన్న భర్త మరణించిన విషయాన్ని తట్టుకోలేక భార్యఆత్మహత్య చేసుకొంది. మెదక్ జిల్లాలోని చిన్న శంకరంపేటకు చెందిన  రమేష్ ను మహేశ్వరి ప్రేమ వివాహం చేసుకొంది. రమేష్ అనారోగ్యంతో 15 రోజుల క్రితం చనిపోయాడు. దీంతో మహేశ్వరి శనివారం నాడు చెరువులో దూకి ఆత్మహత్య చేసుకొంది. 

wife committed suicide after husband death in Medak district
Author
Medak, First Published Nov 22, 2021, 10:24 AM IST

మెదక్: ప్రేమించి పెళ్లి చేసుకొన్న భర్త అకాల మరణం చెందడంతో తట్టుకోలేని భార్య ఆత్మహత్య చేసుకొంది. తల్లిదండ్రులు మరణించడంతో వారి పిల్లలు అనాధలుగా మారారు. ఈ ఘటన ఉమ్మడి మెదక్ జిల్లాలో చోటు చేసుకొంది.మెదక్ జిల్లాలోని చిన్నశంకరంపేట చెందిన మల్లేశం, లక్ష్మీ దంపతులకు ఇద్దరు కుమార్తెలున్నారు. కూలీ పనులు చేసుకొంటూ జీవనం సాగిస్తున్నారు.  పెద్ద కూతురు maheshwari ముచ్చర్ల ramesh ను love వివాహం చేసుకొంది. మహేశ్వరి స్వంత గ్రామంలోనే ముచ్చర్ల రమేష్ వ్యాపారం చేసుకొంటున్నాడు. ఎనిమిదేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకొన్న మహేశ్వరి, రమేష్ దంపతులకు  కొడుకు, కూతురున్నారు. 15 రోజుల క్రితం అనారోగ్యంతో రమేష్ మరణించాడు. దీంతో మహేశ్వరి మానసికంగా కుంగిపోయింది. 

భర్తను తలుచుకొంటూ తీవ్ర ఆవేదన చెందేది. శనివారం నాడు రాత్రి కుటుంబసభ్యులతో కలిసి భోజనం చేసి పడుకొంది. అయితే ప్రతి రోజూ మాదిరిగానే పాల ప్యాకెట్ తీసుకెళ్లేందుకు తన స్కూటీ తీసుకొని వెళ్లింది. ఎంతసేపైనా ఆమె తిరిగి రాలేదు. దీంతో మహేశ్వరి తండ్రికి  అత్త విషయం చెప్పింది. అయితే  స్కూటీపై మహేశ్వరి చెరువు వైపునకు వెళ్లినట్టుగా గ్రామస్తులు చెప్పారు.

also read:రామగుండం స్టేషన్ లో దారుణం.. రైలుకి ఎదురెళ్లి యువకుడు ఆత్మహత్య, (వీడియో)

 ఈ విషయం తెలుసుకొన్న కుటుంబసభ్యులు చెరువు వైపునకు వెళ్లేసరికి చెరువు కట్ట వద్ద మహేశ్వరి చెప్పులు, స్కూటీ కన్పించింది. వెంటనే గజ ఈతగాళ్ల సహాయంతో చెరువులో గాలించారు. అప్పటికే మహేశ్వరి చనిపోయింది.  చనిపోయిన మహేశ్వరి మృతదేహన్ని గజ ఈతగాళ్లు బయటకు తీశారు. మరో వైపు ఈ విషయం తెలుసుకొన్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. మహేశ్వరి మామా ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు  చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

భర్త మరణించిన విషయాన్ని తట్టుకోలేక మహేశ్వరి చెరువులో దూకి ఆత్మహత్య చేసుకొందని స్థానికులు చెబుతున్నారు. రమేష్ చనిపోయిన నాటి నుండి కూడా మహేశ్వరి మానసికంగా కుంగిపోయిందని కుటుంబ సభ్యులు గుర్తు చేసుకొంటున్నారు. తల్లీదండ్రులు ఇద్దరు మరణించడంతో ఇద్దరు పిల్లలు అనాధలయ్యారు. చిన్న పిల్లలను తాము ఏలా సాకాలని నానమ్మ, తాత కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. 

ప్రేమించి పెళ్లి చేసుకొన్న ఎనిమిదేళ్లకే భార్యా భర్తలు మృతి చెందడంతో ఈ రెండు కుటుంబాల్లోవిషాదం నింపాయి. ఒకే గ్రామానికి చెందిన ఇద్దరు ప్రేమించి పెళ్లి చేసుకొని సంతోషంగా జీవనం సాగిస్తున్నారు. ఈ సమయంలో రమేష్ ను అనారోగ్యం రూపంలో మృత్యువు తీసుకెళ్లింది. దీంతో రమేష్ భార్య మహేశ్వరి ఆత్మహత్య చేసుకొంది. 

వివాహేతర సంబంధం కోసం కట్టుకొన్న భర్తనే ప్రియుడి సహాయంతో హత్యలు చేయిస్తున్న ఘటనలు ఇటీవల కాలంలో తెలంగాణ రాష్ట్రంలో చోటు చేసుకొన్నాయి. అయితే దానికి భిన్నంగా  భర్త మరణించిన విషయాన్ని  తట్టుకోలేక మహేశ్వరి ఆత్మహత్య చేసుకొంది. మహేశ్వరి, రమేష్ మృతి చెందడం రెండు కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. ఈ దంపతులకు పుట్టిన పిల్లలు అనాధలయ్యారు. ఈ చిన్నారులు తల్లీదండ్రుల కోసం విలపిస్తున్నారు. మహేశ్వరి చనిపోయిన విషయం తెలియక పిల్లలు తల్లి కోసం  కుటుంబ సభ్యులను ప్రశ్నించడం స్థానికులను కంటతడి పెట్టించింది.

Follow Us:
Download App:
  • android
  • ios