Asianet News TeluguAsianet News Telugu

చంపి కాళ్లు, చేతులు, మొండెం వేరు చేశారు: భార్య, కుమారుల పనే

కర్ణాటక రాష్ట్రంలోని సరిహద్దు గ్రామంలో ఓ వ్యక్తిని హత్య చేసి, శరీరభాగాలు వేరు చేసి సంచిలో కుక్కి తెలంగాణలోని బసంత్ పూర్ చెక్ డ్యాంలో పడేశారు. ఈ కేసును పోలీసుుల ఛేదించారు. 

Wife and sons kill a man at Zaheerabad in Telangana
Author
Zaheerabad, First Published Jan 14, 2021, 8:42 AM IST

జహీరాబాద్: తెలంగాణలోని న్యాల్ కల్ మండలం బసంత్ పూర్ శివారులో లభించిన గుర్తు తెలియని శవం మిస్టరీని పోలీసులు ఛేదించారు. ఈ నెల 8వ తేదీన బసంత్ పూర్ శివారులోని చెక్ డ్యామ్ లో పోలీసుుల ఓ వ్యక్తి మృతదేహాన్ని కనిపెట్టారు. గుర్తు తెలియని వ్యక్తి శవంగా కేసు నమోదు చేసుకున్నారు. 

ఆ కేసుకు సంబంధించిన వివరాలను జహీరాబాద్ డిఎస్పీ శంకర్ రాజు, రూరల్ సీఐ కృష్ణకిశోర్, హద్నూర్ ఎస్సై విజయరావు అందించారు. కాళ్లు, చేతులు, మొండెం వేరు చేసి ఓ సంచిలో మూటగట్టి చెక్ డ్యాంలో మృతదేహాన్ని పారేశారు. ఆ మృతదేహం కర్ణాటకలోని అష్టూర్ గ్రామానికి చెందిన వైద్యనాత్ (57)గా పోలీసులు గుర్తించారు. 

భార్య పుణ్యమ్మకు వివాహేతర సంబంధం ఉందని అనుమానిస్తూ వైద్యనాత్ తరుచుగా వేధింపులకు పాల్పడుతూ వస్తున్నాడు. దాంతో పాటు గ్రామంలో ఆ విషయాన్ని ప్రచారం చేస్తూ వచ్చాడు. దీంతో పరువు పోతుందని భావించి భార్య తన కుమారులతో కలిసి అతన్ని హత్య చేసింది. 

నిరుడు డిసెంబర్ 31వ తేదీన వైద్యనాథ్ ను ఇంట్లో బంధించి తీవ్రంగా కొట్టి చంపేశారు. ఆ తర్వాత కాళ్లు, చేతులు, మొండెం వేరు చేసి ఓ సంచిలో కుక్కి కర్ణాటక సరిహద్దు దాటి వచ్చారు. ఆ సంచీని బసంత్ పూర్ శివారులోని చెక్ డ్యాంలో పడేశారు. ఐదుగురు కలిసి ఈ హత్యకు పాల్పడ్డారు. ఈ కేసులో పోలీసులు బుధవారం సంతోష్, అనుకేష్ లను అరెస్టు చేశారు. 

వైద్యనాథ్ భార్య పుణ్యమ్మతో పాటు కుమారులు అంకుష్, ఆకాశ్ పరారీలో ఉన్నారు. త్వరలోనే వారిని పట్టుకుంటామని పోలీసులు చెప్పారు.

Follow Us:
Download App:
  • android
  • ios