తెలంగాణ ముఖ్యమంత్రి అధికారిక నివాసం ప్రగతి భవన్ వద్ద ఓ కుటుంబం ఆత్మహత్యాయత్నం చేయడం కలకలం రేపింది. వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బందిని వారిని అడ్డుకుని ఒంటిపై నీటిని పోశారు. 

తెలంగాణ ముఖ్యమంత్రి అధికారిక నివాసం ప్రగతి భవన్ వద్ద ఓ కుటుంబం ఆత్మహత్యాయత్నం చేయడం కలకలం రేపింది. గురువారం భార్యాభర్తలు ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకునే ప్రయత్నం చేశారు. వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బందిని వారిని అడ్డుకుని ఒంటిపై నీటిని పోశారు. అయితే వారు ఎవరు.. ఎక్కడి నుంచి వచ్చారు..? ఎందుకోసం ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారు అనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred