Jangaon: కౌలు రైతులకు కూడా పంట‌న‌ష్టం పరిహారం చెల్లిస్తామ‌ని మంత్రి ఎర్రబెల్లి ద‌యాక‌ర్ రావు తెలిపారు. పంట నష్టం, ధాన్యం కొనుగోళ్లు తదితర అంశాలపై అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ పంట నష్టంపై అధికారులు నివేదికలు సమర్పించిన తర్వాత పరిహారం ఇచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. 

Panchayat Raj and Rural Development Minister Errabelli Dayakar Rao : రైతులు ఆత్మవిశ్వాసం కోల్పోవద్దని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కోరారు. ఇటీవల కురిసిన వర్షాలకు పంట నష్టపోయిన కౌలు రైతులతో సహా రైతులందరికీ రాష్ట్ర ప్రభుత్వం సమానంగా నష్టపరిహారం అందిస్తుందని హామీ ఇచ్చారు. పంట నష్టం, ధాన్యం కొనుగోళ్లు తదితర అంశాలపై శనివారం అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ పంట నష్టంపై అధికారులు నివేదికలు సమర్పించిన తర్వాత పరిహారం ఇచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. పంట నష్టంపై అధికారులు త్వరితగతిన సర్వే పూర్తి చేసి రైతులకు జాప్యం లేకుండా పరిహారం అందేలా చూడాలని, ప్రతి ధాన్యం పీపీసీల వద్ద కొనుగోలు చేసేలా చూడాలని అధికారులను ఆదేశించారు.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

మొక్కజొన్న కొనుగోలుకు ప్రభుత్వం నిర్ణయించినందున ఈ విషయాన్ని రైతులకు తెలియజేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలని మంత్రి సూచించారు. ఈదురుగాలులకు విద్యుత్ లైన్లు దెబ్బతిన్నాయని, దెబ్బతిన్న, పాత స్తంభాలను వీలైనంత త్వరగా మార్చేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జిల్లాలో అకాల వర్షాలు, వడగండ్ల వానకు యాసంగి వరి 44,116 ఎకరాలు, మామిడి 3297 ఎకరాలు, మొక్కజొన్న 430 ఎకరాలు, కూరగాయలు 93 ఎకరాల్లో దెబ్బతిన్నాయని జిల్లా కలెక్టర్ సీహెచ్ శివలింగయ్య తెలిపారు. పిడుగుపాటుకు పలు పశువులు మృతి చెందగా, 19 ఇళ్లు ధ్వంసమైనట్లు ప్రాథమిక అంచనా. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఎం.యాదగిరిరెడ్డి, జడ్పీ చైర్మన్ పి.సంపత్ రెడ్డి, అదనపు కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్ తదితరులు పాల్గొన్నారు.

Scroll to load tweet…