Asianet News TeluguAsianet News Telugu

నాయిని మాటలను తిప్పి కొట్టిన విజయశాంతి

అణచివేత ఉన్న చోట తిరుగుబాటు వస్తుందని ఆమె హెచ్చరించారు. వరంగల్ బిడ్డలు శృతి, సాగర్‌ల పైశాచిక హత్యలపై కేసీఆర్ ప్రభుత్వం నుంచి ఇప్పటికీ సమాధానం రాలేదని ఆమె  విమర్శించారు. 

Vijayashanti condemns nayani remark on Maoists
Author
Hyderabad, First Published Sep 25, 2018, 12:36 PM IST

తెలంగాణ ఆపద్ధర్మ హోం మంత్రి నాయిని వ్యాఖ్యలను కాంగ్రెస్ నేత విజయశాంతి తిప్పి కొట్టారు. ఆదివారం ఏపీలో మావోయిస్టులు దాడి చేసి.. ఇద్దరు నేతలను దారుణంగా హత్య చేసిన సంగతి తెలిసిందే. కాగా.. ఈ విషయంపై స్పందించిన నాయిని.. తెలంగాణలో మావోయిస్టుల బెడద లేదని వ్యాఖ్యానించారు.

కాగా..ఆ వ్యాఖ్యలపై విజయశాంతి స్పందించారు. తెలంగాణలో మావోయిస్టులకు చోటు లేదనడం సరికాదని కాంగ్రెస్ నేత విజయశాంతి అన్నారు. అణచివేత ఉన్న చోట తిరుగుబాటు వస్తుందని ఆమె హెచ్చరించారు. వరంగల్ బిడ్డలు శృతి, సాగర్‌ల పైశాచిక హత్యలపై కేసీఆర్ ప్రభుత్వం నుంచి ఇప్పటికీ సమాధానం రాలేదని విమర్శించారు. చంపడం తప్పయితే అందులో ప్రభుత్వాలకు మినహాయింపు లేదని తెలుసుకోవాలని ఆమె సూచించారు.

Follow Us:
Download App:
  • android
  • ios