గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ పై విధించిన సస్పెన్షన్ ను ఎత్తివేయాలని బీజేపీ నాయకత్వాన్ని కోరారు విజయశాంతి.
హైదరాబాద్: గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ పై సస్పెన్షన్ ఎత్తివేయాలని సినీ నటి, బీజేపీ నేత విజయశాంతి కోరారు. రాజాసింగ్ పై సస్పెన్షన్ అంశంలో బీజేపీ నాయకత్వం నిర్ణయం ఆలస్యమౌతుందని విజయశాంతి అభిప్రాయపడ్డారు.రాజాసింగ్ పై సస్పెన్షన్ ను ఎత్తివేయాలని ఆమె కోరారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా విజయశాంతి కోరారు.
గూగుల్లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండి
Scroll to load tweet…
2022 ఆగస్టు మాసంలో మహ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలను సోషల్ మీడియాలో పోస్టు చేశారని రాజాసింగ్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ విషయమై బీజేపీ నాయకత్వం రాజాసింగ్ పై సస్పెన్షన్ వేటేసింది. రాజాసింగ్ పై సస్పెన్షన్ ను ఎత్తివేయాలని పార్టీలో నేతలు కోరుతున్నారు. రాజాసింగ్ పై సస్పెన్షన్ ను ఎత్తివేయాలని రాష్ట్రానికి చెందిన నేతలు పార్టీ జాతీయ నాయకత్వాన్ని కోరారు.
