: కాంగ్రెస్ నేత ఒంటేరు ప్రతాప్ రెడ్డి శుక్రవారం సాయంత్రం టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ లో చేరారు.
హైదరాబాద్: కాంగ్రెస్ నేత ఒంటేరు ప్రతాప్ రెడ్డి శుక్రవారం సాయంత్రం టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ లో చేరారు. తన అనుచరులతో కలిసి ప్రతాప్ రెడ్డి టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకొన్నారు.
టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.నాలుగేళ్లుగా రాషట్రంలో టీఆర్ఎస్ చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలతో ప్రజలు పెద్ద ఎత్తున టీఆర్ఎస్కు ఓట్లు వేశారని ఆయన చెప్పారు.
తాను కొండ పోచమ్మ సాగర్, మల్లన్నసాగర్ ప్రాజెక్టుల నిర్మాణం కారణంగా నిర్వాసితుల తరపున పోరాటం చేసినా కూడ ప్రజలు పెద్ద ఎత్తున కేసీఆర్కే ఓట్లు వేశారని చెప్పారు. 2009, 2014, 2018 ఎన్నికల సమయంలో తనను టీఆర్ఎస్ లో చేరాలని కోరినా కూడ చేరలేదన్నారు. గతంలోనే టీఆర్ఎస్లో చేరితే తాను లబ్ది పొందేవాడినని చెప్పారు.గజ్వేల్ నుండి ఎమ్మెల్యేగా ఎన్నిక కావాలనే ఉద్దేశ్యంతోనే తాను పోరాటం చేసినట్టు ఒంటేరు ప్రతాప్ రెడ్డి చెప్పారు.
Read Exclusive COVID-19 Coronavirus News updates, from Telangana, India and World at Asianet News Telugu.
వర్చువల్ బోట్ రేసింగ్ గేమ్ ఆడండి మిమ్మల్ని మీరు ఛాలెంజ్ చేసుకోండి ఇప్పుడే ఆడటానికి క్లిక్ చేయండి
Last Updated Jan 18, 2019, 5:25 PM IST