జగిత్యాలలో కలకలం.. కుళ్లిన స్థితిలో స్త్రీ పురుషుల మృతదేహాలు
చనిపోయి రెండు మూడు రోజులు గడిచినట్లు పోలీసులు భావిస్తున్నారు. రెండు మృతదేహాలు.. కుళ్లిపోయి ఉన్నాయి.
జగిత్యాల జిల్లాలో రెండు మృతదేహాలు కలకలం రేపాయి. జగిత్యాల జిల్లా మల్యాల మండలం నూకపెల్లి అర్బన్ కాలనీ సమీపంలోని గాడుదల గండి దగ్గర ఇద్దరు అనుమానాస్పద స్థితిలో మృతి చెంది కనిపించారు.
మృతుల్లో ఒకరు స్త్రీ, మరొకరు పురుషుడిగా గుర్తించారు. చనిపోయి రెండు మూడు రోజులు గడిచినట్లు పోలీసులు భావిస్తున్నారు. రెండు మృతదేహాలు.. కుళ్లిపోయి ఉన్నాయి. మృతుడు గొల్లపల్లి తిరుమలపూర్ గ్రామం కి చెందిన గాదె కిరణ్ గా గుర్తించారు. స్త్రీ గురించి వివరాలు తెలియరాలేదు.
ఈ రెండు మృతదేహాలకు సమీపంలో ఒక పల్సర్ బైక్ ఆగి ఉంది. బైక్ నెంబర్ ఏపి15 AZ 5837 గా ఉంది. వారిది హత్య, ఆత్మహత్యో తెలీలేదు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.