భూ వివాదం.. ట్రాక్టర్తో ప్రత్యర్ధిని ఢీకొట్టి చంపబోయిన ఇద్దరు వ్యక్తులు
భూ వివాదం నేపథ్యంలో ఓ వ్యక్తిని ట్రాక్టర్తో ఢీకొట్టి చంపబోయారు ఇద్దరు వ్యక్తులు. నల్గొండ జిల్లా మునుకుంట్లలో ఈ దారుణం జరిగింది.
నల్గొండ జిల్లా మునుకుంట్లలో దారుణం జరిగింది. కొంతకాలంగా రవీందర్, విజయ్, సుధాకర్ అనే మధ్య భూ వివాదం వుంది. ఈ క్రమంలో విజయ్, సుధాకర్లు పొలాన్ని చదును చేస్తూ వుండగా.. రవీందర్ అడ్డుకున్నాడు. దీంతో రవీందర్ను ట్రాక్టర్తో ఢీకొట్టి చంపేందుకు విజయ్ , సుధాకర్ ప్రయత్నించారు. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.