అనాజ్పూర్లో దారుణం: రెండు నెలల బాలుడి హత్య, ఇంటిపై నీళ్ల ట్యాంక్ లో శవం
రంగారెడ్డి జిల్లా అనాజ్పూర్ రెండు నెలల బాలుడిని గుర్తు తెలియని దుండగులు చంపి నీటి ట్యాంకులో వేశారు. అనాజ్పూర్ గ్రామానికి చెందిన బాలమణిని రంగారెడ్డి జిల్లాలోని దండుమైలారం గ్రామానికి చెందిన తిరుమలేష్ తో వివాహం జరిగింది.
హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా అనాజ్పూర్ రెండు నెలల బాలుడిని గుర్తు తెలియని దుండగులు చంపి నీటి ట్యాంకులో వేశారు. అనాజ్పూర్ గ్రామానికి చెందిన బాలమణిని రంగారెడ్డి జిల్లాలోని దండుమైలారం గ్రామానికి చెందిన తిరుమలేష్ తో వివాహం జరిగింది. ప్రసవం కోసం బాలమణి పుట్టిల్లైన అనాజ్పూర్ కు రెండు నెలల క్రితం వచ్చింది. బాలమణికి మగపిల్లాడు పుట్టాడు.
తన పక్కలోనే ఉన్న బాలుడు నిద్రలేచేసరికి లేకపోవడంతో బాలమణి సహ ఆమె తల్లిదండ్రులు వెతికారు. అయినా ఫలితం లేకపోయింది. శుక్రవారం నాడు తెల్లవారుజామున ఇంటిపై ఉన్న నీటి ట్యాంకులో ఈ బాలుడి మృతదేహాన్ని గుర్తించారు. హత్య చేసిన తర్వాత బాలుడి మృతదేహన్ని నీటి ట్యాంకులో వేసినట్టుగా అనుమానిస్తున్నారు. .కుటుంబ కలహాల కారణంగానే ఈ బాలుడిని హత్య చేసినట్టుగా ఆరోపణలు విన్పిస్తున్నాయి. . గ్రామంలో సీసీటీవీ పుటేజీని పోలీసులు పరిశీలిస్తున్నారు. బాధిత కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.