Asianet News TeluguAsianet News Telugu

అమానుషం : చిన్నారులకు చాక్లెట్ల ఆశ చూపి.. అత్యాచారం..!

నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో రెండు అమానుష ఘటనలు చోటు చేసుకున్నాయి. అభంశుభం తెలియని చిన్నారులకు చాక్లెట్ల ఆశ చూపి అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఒక కేసులో నిందితుడు దివ్యాంగుడు కాగా మరో కేసులో ఈ దారుణానికి పాల్పడింది పదిహేనేళ్ల బాలుడు కావడం భయాందోళనలు కలిగించే విషయం. 

two children chocolates molestation in different incidents in nizamabad
Author
Hyderabad, First Published Oct 8, 2021, 7:30 AM IST

అమ్మాయిల మీద అత్యాచారాలు కొత్త రూపు తీసుకుంటున్నాయి. వయసు తేడా లేకుండా అత్యాచారాలకు పాల్పడడం ఎప్పటినుంచో ఉన్నదే.. అయితే ఇటీవలి కాలంలో చిన్నారుల మీద అత్యాచారాల ఘటనలు పెరిగిపోతున్నాయి. ఇంట్లో తోబుట్టువులు, తండ్రి, బాబాయిలాంటి వారితో సహా ప్రతీ ఒక్కరు చిన్నారులను చిదిమేయాలనే చూస్తున్నారు. తాజాగా ఓ handicapped వ్యక్తి, మైనర్ బాలుడు చిన్నారులను చిదిమేయడం.. అత్యంత భయాందోళనలు కలిగించే విషయం. 

ఈ ఘటనలు నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో రెండు అమానుష ఘటనలు చోటు చేసుకున్నాయి. అభంశుభం తెలియని చిన్నారులకు చాక్లెట్ల ఆశ చూపి అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఒక కేసులో నిందితుడు దివ్యాంగుడు కాగా మరో కేసులో ఈ దారుణానికి పాల్పడింది పదిహేనేళ్ల బాలుడు కావడం భయాందోళనలు కలిగించే విషయం. 

నిజామాబాద్ ఏసీపీ ఆరె వెంకటేశ్వర్ కథనం ప్రకారం.. ఓ కానీలో కూలీ పనులు చేసుకుని బతికే కుటుంబాలు నివసిస్తున్నాయి. పెద్దలు, పిల్లలను ఇంట్లో వదిలి పనులకు వెడుతుంటారు. ఆదివారం కాలనీలో ఆడుకుంటున్న చిన్నారులమీద (8యేళ్లు,12 యేళ్లు) స్థానికుడైన వసీం(33) కన్నేశాడు.

వారికి chocolates ఆశ చూపించాడు. ఆ చిన్నారులు ఆశగా అతని దగ్గరికి వచ్చారు. వారిని నిర్మానుష్య ప్రదేశానికి తీసుకువెళ్లి.. అక్కడ molestation చేశాడు. బుధవారం ఓ minor girlకి కడుపునొప్పి రావడంతో కుటుంబీకులకు చెప్పింది. వారు కడుపునొప్పికి కారణాలేంటని ప్రశ్నించే క్రమంలో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. 

గర్భందాల్చిన అత్యాచార బాధితురాలు: అబార్షన్‌పై హైకోర్టు సంచలన తీర్పు

వారు వెంటనే గురువారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడు వసీంను రిమాండుకు తరలించినట్లు ఏసీపీ తెలిపారు. పోలియో బాధితుడైన అతను మేస్త్రీగా పనిచేస్తుంటాడు. అతడికి భార్య, ఓ పాప ఉన్నారు. మరో ఘటనలో ఎల్లారెడ్డి డివిజనలో ఇంటి బయట ఆడుకుంటున్న ఆరేళ్ల చిన్నారిమీద అదే కాలనీకి చెందిన పదిహేనేళ్ల బాలుడు గురువారం చాక్లెట్ల ఆశ చూపి.. ఇంటి వెనక్కి తీసుకెళ్లి అత్యాచారం చేశారు. 

ఇంట్లో నిద్రపోతున్న తల్లి బాలిక కేకలు విని వచ్చి చూసేసరికి boy పారిపోతూ కనిపించాడు. బాధితులు ఠాణాలో ఫిర్యాదు చేశారు. బాలుడి గురించి పోలీసులు వెతుకుతున్నారు. బాలుడి మీద కేసు నమోదు చేశారు. 

Follow Us:
Download App:
  • android
  • ios