సారాంశం

మెదక్ జిల్లాలో శిక్షణ విమానం కూలిపోయింది.  ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. 

హైదరాబాద్: ఉమ్మడి మెదక్ జిల్లా తూఫ్రాన్ రావెల్లి శివారులో  శిక్షణ విమానం సోమవారంనాడు కూలిపోయింది.  కూలిపోయిన శిక్షణ విమానం దుండిగల్ ఎయిర్ ఫోర్స్  కు చెందినదిగా పోలీసులు  గుర్తించారు.   భారీ శబ్దంతో  విమానం కూలిపోయింది.  భారీ శబ్దం రావడంతో స్థానికులు అక్కడికి చేరుకున్నారు. స్థానికులు అక్కడికి చేరుకొనే సమయానికి  విమానం మంటల్లో చిక్కుకుంది. స్థానికులు  వెంటనే  మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు.