నల్గొండలో తలపెట్టిన కాంగ్రెస్ నిరుద్యోగ నిరసన సభను రద్దు చేస్తున్నట్లు టీపీసీసీ ప్రకటించింది. స్థానిక ఎంపీనైన తనకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా రేవంత్ ఈ సభను ఎలా ప్రకటిస్తారంటూ ఉత్తమ్ కుమార్ రెడ్డి అలకబూనారు. 

నల్గొండలో తలపెట్టిన కాంగ్రెస్ నిరుద్యోగ నిరసన సభను రద్దు చేస్తున్నట్లు టీపీసీసీ ప్రకటించింది. షెడ్యూల్ ప్రకారం ఈ నెల 21న నల్గొండ ఎంజీ యూనివర్సిటీలో కాంగ్రెస్ నిరుద్యోగ నిరసన సభ నిర్వహిస్తామని టీపీపీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రకటించారు. అయితే స్థానిక ఎంపీనైన తనకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా రేవంత్ ఈ సభను ఎలా ప్రకటిస్తారంటూ ఉత్తమ్ కుమార్ రెడ్డి అలకబూనారు. ఆయన అభ్యంతరంతో టీపీసీసీ స్పందించింది. నిరుద్యోగ నిరసన సభను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred