తెలంగాణ గవర్నర్ ఇవాళ ఉదయం  రెండున్నర గంటల పాటు గవర్నర్ నరసింహాన్ హైద్రాబాద్ లో జరిగే కార్యక్రమంలో పాల్గొంటారు. ఆ తర్వాత రాజ్ భవన్ లోనే ఉంటారు

హైదరాబాద్: తెలంగాణ గవర్నర్ ఇవాళ ఉదయం రెండున్నర గంటల పాటు గవర్నర్ నరసింహాన్ హైద్రాబాద్ లో జరిగే కార్యక్రమంలో పాల్గొంటారు. ఆ తర్వాత రాజ్ భవన్ లోనే ఉంటారు. మధ్యాహ్నం ఒంటి గంటకు సీఎం కేసీఆర్ గవర్నర్ తో సమావేశమయ్యే అవకాశం ఉంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred

తెలంగాణ కేబినెట్ మధ్యాహ్నం ఒంటి గంటకు సమావేశమయ్యే అవకాశంఉంది. ఈ సమావేశంలో అసెంబ్లీ రద్దుకు సంబంధించిన విషయమై తీర్మానం చేయనున్నారు.

ఈ తీర్మానం కాపీని మధ్యాహ్నం కేసీఆర్ గవర్నర్ ను కోరనున్నారు. ఇవాళ ఉదయం 8 గంటలకు గవర్నర్ హైద్రాబాద్ లో జరిగే ఓ కార్యక్రమంలో పాల్గొంటారు. ఉదయం పదిన్నర గంటలకు ఈ సదస్సులో నుండి గవర్నర్ నరసింహాన్ తిరిగి రాజ్ భవన్ కు చేరుకొంటారు.

మధ్యాహ్నం ఒంటి గంటకు రాజ్ భవన్ కు సీఎం కేసీఆర్ చేరుకొంటారని సమాచారం. ఈ మేరకు రాజ్ భవన్ వర్గాలకు సీఎంఓ వర్గాలు సమాచారం ఇచ్చినట్టు సమాచారం. కేబినెట్ రద్దుకు సంబంధించిన తీర్మానం కాపీని కూడ కేసీఆర్ గవర్నర్ కు అందించనున్నారు.

ఆ తర్వాత రాజ్యాంగ పరంగా తీసుకోవాల్సిన చర్యలను గవర్నర్ తీసుకొంటారు. అపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉండాలని కేసీఆర్ ను గవర్నర్ కోరే అవకాశం ఉంది. 

ఈ వార్తను చదవండి

నేడు మధ్యాహ్నం ఒంటి గంటకు కేబినెట్ భేటీ: తెలంగాణ అసెంబ్లీ రద్దు?