Asianet News TeluguAsianet News Telugu

మహిళ తో అసభ్య ప్రవర్తన... ఫాస్ట్ పుడ్ సెంటర్ లో చిత్రహింసలు

కుషాయిగూడ పోలీసులు బాధితురాలి ఫిర్యాదు మేరకు లింగస్వామిని అదుపులోకి తీసుకొని విచారించారు. మరుసటి రోజు రమ్మని చెప్పి పంపేశారు.

Three people Tortured Youth Who misbehave with woman
Author
Hyderabad, First Published Mar 1, 2021, 8:21 AM IST

మహిళతో అసభ్యంగా ప్రవర్తించిన ఓ వ్యక్తికి ఫాస్ట్ ఫుడ్ సెంటర్ లో  చిత్ర హింసలకు గురిచేశారు. ఈ సంఘటన మేడ్చల్ లో చోటుచేసుకోగా... ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

మేడ్చల్ జిల్లా చర్లపల్లి ఈసీ నగర్ కు చెందిన లింగస్వామి అనే వ్యక్తి ఓ మహిళో అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో సదరు మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కుషాయిగూడ పోలీసులు బాధితురాలి ఫిర్యాదు మేరకు లింగస్వామిని అదుపులోకి తీసుకొని విచారించారు. మరుసటి రోజు రమ్మని చెప్పి పంపేశారు.

ఈ నేపథ్యంలో ముగ్గురు వ్యక్తులు లింగస్వామిని మాట్లాడదామని కారులో తీసుకెళ్లారు. చర్లపల్లి ఈసీ నగర్ లోని ఓ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ లో లింగస్వామి నోట్లో గుడ్డలు కుక్కి చితకబాదారు. ఆ రాత్రి మొత్తం కారులో తిప్పి  బాగా కొట్టి వదిలేశారు. ఇందుకు సంబంధించిన ఓ వీడియో వెలుగులోకి రావటంతో బాధితుని తమ్ముడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో ముగ్గురు వ్యక్తుల్ని అరెస్ట్‌ చేసిన పోలీసులు విచారిస్తున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios