విషాదం : చెరువులో ముగ్గురు బాలికల మృతదేహాలు.. !
తెలంగాణ, నిర్మల్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. తనూర్ మండలం, సింగన్ గావ్ గ్రామంలో చెరువులో ముగ్గురు బాలికల మృతదేహాలు దొరికాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు.
తెలంగాణ, నిర్మల్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. తనూర్ మండలం, సింగన్ గావ్ గ్రామంలో చెరువులో ముగ్గురు బాలికల మృతదేహాలు దొరికాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు.
మృతులను సునీత (16), వైశాలి (14), అంజలి (14) గా గుర్తించారు. సునీత, వైశాలి అక్కా చెల్లెల్లు కాగా.. అంజలి వీరి సమీప బంధువు. కాగా, ఆదివారం సాయంత్రం అదృశ్యమైన ఈ ముగ్గురు బాలికలు.. మృత్యవాత పడటంతో ఈ ఘటన ప్రమాదమా? లేదా హత్యలా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. బాలికల మృతితో వారి కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.