Asianet News TeluguAsianet News Telugu

ఘట్కేసర్ ఓఆర్ఆర్ వద్ద బాలిక శవం: హత్య చేసి నిప్పు పెట్టారని అనుమానం

ఘట్కేసర్ ఓఆర్ఆర్ వద్ద ఓ బాలిక శవం అనుమానాస్పద స్థితిలో కనిపించింది. పదో తరగతి పూర్తి చేసిన ఆ బాలికను ఆగంతకులు హత్య చేసి, పెట్రోల్ పోసి శవానికి నిప్పు పెట్టినట్లు అనుమానిస్తున్నారు.

Tenth class girl student dead body found at Ghatkesar ORR in Medchal
Author
Ghatkesar, First Published Jun 19, 2021, 9:58 AM IST

మేడ్చెల్: తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదు సమీపంలో ఓ బాలిక శవం అనుమానాస్పద స్థితిలో కనపించింది. ఘట్కేసర్ ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్) వద్ద బాలిక శవం కనిపించింది. హత్య చేసి బాలిక శవంపై పెట్రోల్ పోసి నిప్పు అంటించారని అనుమానిస్తున్నారు. 

మేడ్చెల్ సమీపంలో కనిపించిన ఆ బాలికను స్రవంతిగా గుర్తించారు. శుక్రవారం అర్థరాత్రి బాలిక ఇంటి నుంచి వెళ్లినట్లు తల్లిదండ్రులు చెబుతున్నారు. ఈ ఏడాది ఆమె పదో తరగతి పూర్తి చేసింది. ఘటనా స్థలంలో పోలీసులు ఆధారాలు సేకరిస్తున్నారు. తల్లిదండ్రులతో గొడవ పడి బాలిక ఇంట్లోంచి బయటకు వచ్చినట్లు పోలీసులు గుర్తించారు.

వివరాలు తెలియాల్సి ఉంది.

Follow Us:
Download App:
  • android
  • ios