తెలంగాణలో ఆగని కరోనా ఉధృతి: 24 గంటల్లో 51 మంది మృతి
తెలంగాణ రాష్ట్రంలో గత 24 గంటల్లో 6361 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో 4,69, 722కి చేరుకొన్నాయి. కరోనాతో గత 24 గంటల్లో 51 మంది మరణించారు. కరోనాతో మరణించిన వారి సంఖ్య 2,527 చేరుకొంది.
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో గత 24 గంటల్లో 6361 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో 4,69, 722కి చేరుకొన్నాయి. కరోనాతో గత 24 గంటల్లో 51 మంది మరణించారు. కరోనాతో మరణించిన వారి సంఖ్య 2,527 చేరుకొంది. .రాష్ట్రంలో 77,704 యాక్టివ్ కేసులున్నాయి. గత 24 గంటల వ్యవధిలో 77,435 మందికి పరీక్షలు నిర్వహించినట్టుగా వైద్య శాఖ తెలిపింది. ఇంకా 3,882 మంది పరీక్షల రిపోర్టు ఇంకా రావాల్సి ఉంది.
గత 24 గంటల వ్యవధిలో ఆదిలాబాద్ లో082, భద్రాద్రి కొత్తగూడెంలో 098, జీహెచ్ఎంసీ పరిధిలో 1225, జగిత్యాలలో178,జనగామలో 051, జయశంకర్ భూపాలపల్లిలో075, గద్వాలలో 087,కామారెడ్డిలో 107, కరీంనగర్ లో 248,ఖమ్మంలో 188, మహబూబ్నగర్లో 229, ఆసిఫాబాద్ లో 057, మహబూబాబాద్ లో107,మంచిర్యాలలో 148,మెదక్ లో 78కేసులు నమోదయ్యాయి.
మల్కాజిగిరిలో422,ములుగులో35,నాగర్ కర్నూల్ లో 190,నల్గగొండలో453, నారాయణపేటలో34, నిర్మల్ లో35, నిజామాబాద్ లో164,పెద్దపల్లిలో100,సిరిసిల్లలో89,రంగారెడ్డిలో423, సిద్దిపేటలో 244,సంగారెడ్డిలో227,సూర్యాపేటలో239, వికారాబాద్ లో 148, వనపర్తిలో110, వరంగల్ రూరల్ లో 99,వరంగల్ అర్బన్ 234, యాదాద్రి భువనగిరిలో 162 కేసులు నమోదయ్యాయి.